అప్పటివరకు నన్ను భరించండి… ఎమోషనల్ పోస్ట్ చేసిన రష్మి.. వైరల్ అవుతున్న పోస్ట్?

రష్మి పరిచయం అవసరం లేని పేరు.ఈమె పలు సినిమాలలో నటిగా నటించడమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు.అయితే వెండితెరపై ఈమెకు పెద్దగా గుర్తింపు రాకపోవడంతో బుల్లితెర కార్యక్రమాలలో మాత్రం విపరీతమైన అభిమానులను సొంతం చేసుకుని ఇండస్ట్రీలో టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇప్పటికే ఈమె ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇలా బుల్లితెరపై పలు కార్యక్రమాలతో బిజీగా ఉన్న రష్మీ తాజాగా అనసూయ జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పడంతో ఆమె స్థానాన్ని కూడా రష్మీ భర్తీ చేశారు. గతంలో కూడా అనసూయ కొన్ని కారణాలవల్ల ఈ కార్యక్రమం నుంచి విరామం తీసుకోవడంతో అనసూయ స్థానాన్ని భర్తీ చేస్తున్న రష్మిక ఇప్పుడు అనసూయ వెళ్ళిపోవడంతో జబర్దస్త్ కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.అయితే ఈ కార్యక్రమానికి కొత్త యాంకర్ ఎవరు అనే ఆత్రుత ప్రేక్షకులలో ఉండగా తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ తో జబర్దస్త్ యాంకర్ రష్మీ అని ప్రకటించారు.

ఈ క్రమంలోనే ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించడంతో సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఈమె స్పందిస్తూ జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో ఘనంగా స్వాగతం పలికినందుకు సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమం కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమేనని, ఈ కార్యక్రమం కోసం తాను ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు చేస్తూనే ఉంటానని తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి కొత్త యాంకర్ వచ్చేవరకు నన్ను భరించండి ప్లీజ్ అంటూ ఈమె ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం రష్మి చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.