విద్యార్థులు గుడ్ న్యూస్ చెప్పిన SBI…ఎటువంటి చార్జీలు లేకుండా రూ. 20 లక్షల లోన్..?

దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఇప్పటికే ఎన్నో పథకాలను అమలులోకి తీసుకువచ్చింది. ఈ పథకాల ద్వారా కస్టమర్లు ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. ఇప్పటికే రైతులకు, వ్యాపారవేత్తలకు ఆర్థికంగా సహాయం చేసే వివిధ పథకాలను అమలులోకి తీసువచ్చి సేవలు అందిస్తోంది. ఇక ఇటీవల విద్యార్థులకు కూడా ఎస్బిఐ ఒక శుభవార్త తెలియజేసింది. పై చదువులు చదవాలనుకునే విద్యార్థుల్లకు ఎటువంటి చార్జీలు లేకుండా రు.20 లక్షల లోన్ అందిస్తోంది. ఈ లోన్ ను తీసుకున్న వాళ్లు 15 సంవత్సరాల లోపు లోన్ ను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా ఈ మొత్తాన్ని పొందే అవకాశం ఉండటం విద్యార్థులకు శుభవార్త అని చెప్పవచ్చు.

అయితే 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రుణం తీసుకునే విద్యార్థులు మాత్రం తప్పనిసరిగా ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎక్కువ మొత్తం రుణాన్ని పొందాలని భావించే వాళ్లు ఆస్తులను తనఖా పెట్టి రుణాన్ని పొందాల్సి ఉంటుంది. అంతే కాకుండా దానిపై 8.3 శాతం నుంచి ఈ వడ్డీ రేటు ఉంటుంది . కాబట్టి అత్యవసరం ఉన్న వారు మాత్రమే ఈ రుణం తీసుకుంటే మంచిది. ఇక విదేశాలలో విద్యను అభ్యసించే వాళ్లు గరిష్టంగా కోటిన్నర రూపాయల వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే వారు లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లను జత చేసి ఈ లోన్ నుపొందవచ్చు.

అంతే కాకుండా మన దేశంలో విద్యను అభ్యసించే విద్యార్థులు కూడా గరిష్టంగా 50 లక్షల రూపాయల వరకు రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే విద్యార్థులు చదివే కోర్సుల ఆధారంగా లోన్ పరిమితిలో మార్పులు ఉంటాయి. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు సమీపంలోని ఎస్బిఐ బ్రాంచ్ ను సంప్రదించి లోన్ కోసం ధరకాస్తు చేసుకోవచ్చు. రోజురోజుకు ఖర్చులు ఊహించని స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఎడ్యుకేషన్ లోన్ ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ బెనిఫిట్స్ ను పొందడానికి ఎస్బిని ఈ స్కీం ని ప్రవేశ పెట్టింది.