సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. మొత్తం 405 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. రిజర్వేషన్ల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. 2023 సంవత్సరం జనవరి చివరి వారం సమయానికి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు.
రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయని సమాచారం అందుతోంది. రాతపరీక్షతో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 1180 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయని సమాచారం అందుతోంది.
దరఖాస్తుతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను స్పీడ్ పోస్ట్ లో పంపాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ను కూడా జత చేయాల్సి ఉంటుందని సమాచారం. జనరల్ మేనేజర్ (పీ/ఎంపీ), ఎస్ఈసీఎల్, సీపట్ రోడ్, బిలాస్పూర్ (సీజీ) – 495 006 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.
2023 సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. http://www.secl-cil.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
