సిడ్బీలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీల భర్తీ.. రాతపరీక్ష లేకుండా రూ.90 వేల జీతంతో?

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 50 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ రంగ బ్యాంక్ లో ఉద్యోగం కోసం ఎదురుచూసే వాళ్లకు ఇది తీపికబురు అనే చెప్పాలి. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నవంబర్ నెల 28వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

sidbi.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ a – జనరల్ స్ట్రీమ్ కేటగిరీలో 50 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.

ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 175 రూపాయలు కాగా ఇతర కేటగిరీల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1100 రూపాయలుగా ఉండనుందని తెలుస్తోంది. అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా లా లో గ్రాడ్యుయేట్ ను కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థుల వయోపరిమితి 30 ఏళ్లలోపు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 90,000 రూపాయల వేతనం లభించనుంది. ఆన్‌లైన్ సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.