విద్యార్థులకు అదిరిపోయే తీపికబురు.. ఎస్బీఐ విద్యాదీపంతో రూ.10 వేలు పొందే ఛాన్స్!

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేద విద్యార్థులకు అదిరిపోయే తీపికబురు అందించింది. చదువులో ప్రతిభ కనబరిచే పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 6వ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కు అర్హులు కాగా కనీసం 75 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

భారతదేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు అర్హత కలిగి ఉంటరు. ఎస్బీఐ ఫౌండేషన్ అందిస్తున్న ఈ స్కాలర్ షిప్ విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తోంది. 3 లక్షల రూపాయల కంటే కుటుంబ వార్షికాదాయం తక్కువగా ఉన్నవాళ్లు ఈ స్కాలర్ షిప్ కు అర్హత కలిగి ఉంటారు. https://www.sbifoundation.in/focus-area-detail/sbif-asha-scholarship వెబ్ సైట్ లింక్ ద్వారా స్కాలర్ షిప్ కోసం దరఖస్తు చేసుకోవచ్చు.

ఎస్బీఐ ఆశా స్కాలర్ షిప్ 2023 వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు. మొబైల్ నంబర్ , ఇమెయిల్‌ ఇతర వివరాలను నమోదు చేసి ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌ మెరిట్‌, ఆర్థిక పరిస్థితిని బట్టి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ నిర్వహించి స్కాలర్ షిప్ ను మంజూరు చేయడం జరుగుతుంది.

ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవాళ్లు ఈ స్కాలర్ షిప్ పై దృష్టి పెడితే మంచిది. స్కాలర్ షిప్ గా 10,000 రూపాయలు అంటే తక్కువ మొత్తం కాదు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేనివారు ఈ స్కాలర్ షిప్ పై దృష్టి పెడితే ప్రయోజనం చేకూరుతుంది. సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ద్వారా ఈ స్కాలర్ షిప్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.