పది అర్హతతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. భారీ వేతనంతో?

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పదో తరగతి పాసైన వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. మసాజ్ థెరపిస్ట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 9 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కాంట్రాక్ట్ బేసిస్ ప్రకారం ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. ఇప్పటికే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పని చేస్తున్న సిబ్బంది సైతం ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మసాజ్ థెరపీలో సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. కనీసం పదో తరగతి చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

పదో తరగతికి సమానమైన అర్హత ఉన్నవాళ్లు సైతం ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. 100 మార్కులకు ఈ పరీక్ష జరుగుతుంది. కేవలం గంట వ్యవధిలో ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 35,000 రూపాయల వేతనం లభిస్తుంది. ది ప్రిన్సిపాల్, లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కార్యవట్టం, తిరువనంతపురం- 695581, కేరళ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 35,000 రూపాయల వేతనం లభించనుంది.