నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లో భారీగా ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.55 వేల వేతనంతో?

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 55,000 రూపాయల వేతనం లభించనుంది. careers.ntpc.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఫిబ్రవరి నెల 8వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఎక్కువ మొత్తం వేతనం లభించనున్న నేపథ్యంలో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. మొత్తం 223 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 98 ఉద్యోగ ఖాళీలు కాగా ఇతర కేటగిరీల అభ్యర్థులు మిగతా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.

35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా మిగతా అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కనీసం బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.

అధికారిక వెబ్ సైట్ లో అప్లై ఆప్షన్ ను ఎంచుకుని అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసి ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 300 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రం ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.