ఆరోగ్య శ్రీలో ఆరోగ్య మిత్ర, టీమ్ లీడర్ ఉద్యోగాలకు జాబ్ నోటిఫికేషన్.. మంచి వేతనంతో?

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆరోగ్యశ్రీ పరిధిలో పని చేస్తున్న ఆరోగ్య మిత్రలు రోగులకు మానసిక ధైర్యం అందించడంతో పాటు ధైర్యం కల్పించి మంచి చికిత్స కలిగేలా చేస్తున్నారు. జిల్లాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమవగా తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది.

వైద్య ఆరోగ్య శాఖ ఖాళీగా ఉన్న వేర్వేరు పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఒంగోలులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డాక్టర్ రాజ్యలక్ష్మి ఈ జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఆరోగ్య మిత్ర ఉద్యోగ ఖాళీలు 17 ఉండగా టీం లీడర్స్ ఉద్యోగ ఖాళీలు 2 ఉన్నాయి. ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

prakasam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా సమన్వయ కర్త, డాక్టర్ వైస్సార్ ఆరోగ్య శ్రీ కార్యాలయము, ఓల్డ్ రిమ్స్ హాస్పిటల్, ఒంగోలు అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఒకింత భారీ వేతనం లభించనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుండగా అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.