మహా వారాహి దేవిని పూజిస్తే అప్పుల బాధ దూరమవుతుందట.. ఎలా పూజించాలంటే?

మనలో చాలామందిని అప్పుల బాధలు ఇబ్బందులు పెడుతుంటాయి. ఒకసారి అప్పు చేయడం మొదలుపెడితే ఆ అప్పును తీర్చడానికి మరికొన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మహా వారాహి దేవిని పూజించడం ద్వారా అప్పుల బాధలను దూరం చేసుకోవచ్చు. పండితులు ఈ విషయాలను చాలా సందర్భాల్లో వెల్లడించారు. మంగళ, శుక్ర వారాలలో వారాహి దేవిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

ఈ దేవతను పూజించడం వల్ల రుణ బాధలు తొలగిపోవడంతో పాటు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మనలో కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా డబ్బులు చేతిలో నిలవడం లేదని చెబుతుంటారు. అలాంటి వాళ్లు వారాహి అమ్మవారిని పూజించడం ద్వారా లక్షాధికారులు ఆయ్యే అవకాశం కూడా ఉంటుంది. వారాహి అమ్మవారు మహావిష్ణు స్వరూపం అనే సంగతి తెలిసిందే.

వారాహి అమ్మవారి ముందు నెయ్యి దీపం వేసి వెలిగించడం ద్వారా శుభ ఫలితాలను పొందే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. వారాహి అమ్మవారిని పూజించడంతో పాటు ఆది దేవుడైన వినాయకుడిని పూజించడం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. సంతానం లేని వాళ్లు వినాయకుడిని పూజిస్తే సంతానం కలుగుతుంది. తోరణ గణేషుడిని పూజించడం ద్వారా అప్పుల బాధలు దూరమవుతాయి.

శివ ఆగమ శాస్త్రం ప్రకారం తోరణ వినాయకుడిని పూజించడం ద్వార మన అప్పులు తీరే అవకాశాలు కూడా ఉంటాయి. వినాయకుడిని పూజించాలని భావించే వాళ్లు మంగళ, శని, ఆదివారాలలో ఏదో ఒకరోజును ఎంచుకుని వరుసగా ఆరు వారాల పాటు పూజలు చేస్తే మంచి ఫలితాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. గణపతి మూల మంత్రాన్ని పఠించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది.