కోరిక ప్రతి కోరికను నెరవేర్చే గుడి ఇదే.. ఈ స్తోత్రం చదివితే కోరికలు తీరతాయట!

మనలో చాలామంది కోరుకున్న కోరికలు నెరవేరకపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు ఇప్పటికే మొదలుకాగా అమ్మవారి శక్తి స్వరూపాలలో వారాహి కూడా ఒకటి కావడం గమనార్హం. వారాహి అమ్మవారు లలితాదేవికి సైన్యాధిపతి అని చెప్పవచ్చు. భక్తులు ఏ కోరిక కోరినా వారాహి అమ్మవారు ఆ కోరికను కచ్చితంగా నెరవేరుస్తారు. వారాహి అమ్మవారిని పూజించడం వల్ల సమస్యలు తొలగిపోయి మంచి ఫలితాలు దక్కుతాయి.

 

వారాహి అమ్మవారిని పూజించడం వల్ల అపారమైన జ్ఞానం కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. వారాహి అమ్మవారికి సంబంధించిన మంత్రాలను, అష్టోత్తరాలను చదివితే శుభ ఫలితాలు వస్తాయి. పంచమి, సమయ సంకేత, దండనాథా, వారాహీ, సంకేతా, పోత్రిణి, శివా, మహాసేన, వార్తాళి, అరిఘ్ని ఆజ్ఞా చక్రేశ్వరి 12 నామాలు కాగా ఈ 12 నామాలను రోజుకు 11 సార్లు పఠించడం వల్ల శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది.

 

ఐమ్ క్లీమ్ సౌ అనే స్తోత్రాన్ని జపించడం వల్ల సమస్యలకు పరిష్కారం దొరకడంతో పాటు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రతిరోజూ సాయంత్రం సమయంలో అమ్మవారిని పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అమ్మవారి చిత్ర పటం, కాస్త గంధం, తెలుగు రంగు పూలు, సాంబ్రాణి దూపం ఉపయోగించి అమ్మవారిని పూజించవచ్చు.

 

అమ్మవారికి మహా దీపంతో పాటు చిన్నదీపం వెలిగించడం వల్ల మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. నల్లబెల్లం రెండు లవంగాలు నైవేద్యంగా సమర్పిస్తే మంచిది. నర దిష్టి, చెడు దిష్టి, ఎదుటివారి శాపం తగలకుండా ఉండాలంటే అష్టమి తిధి పంచమి నాడు అమ్మవారిని పూజించాలి. శుక్ర గోరల్లో పరిహారం చేయడం ద్వారా సులభంగా శుభ ఫలితాలు పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.