పేటియం వినియోగదారులకు శుభవార్త.. రూ. 100 క్యాష్ బ్యాక్ పొందే అవకాశం..?

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల డిజిటల్ పేమెంట్స్ యాప్స్ కి డిమాండ్ బాగా పెరిగింది. ఎక్కడికి వెళ్లినా కూడా టికెట్స్, హోటల్ బిల్స్, షాపింగ్ ఇలా ప్రతి దానికి ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేస్తున్నారు. దీంతో డిజిటల్‌ పేమెంట్‌ సంస్థల మధ్య పోటీ బాగా పెరిగింది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో , ఆఫర్స్ తో యూజర్లను అట్రాక్ట్‌ చేస్తున్నాయి.ఈ క్రమంలో ప్రముఖ డిజిల్‌ పేమెంట్‌ సంస్థ పేటీఎమ్‌ తన యూజర్లకు యూపీఐ లైట్‌ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

ఈ ఫీచర్‌ ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు పేమెంట్ చేసిన ప్రతిసారీ పిన్‌ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. అంతే కాకుండా దీని ద్వారా అత్యంత వేగంగా యూపీఐ లావాదేవీలను జరపావచ్చు. ఇలాంటి ఫీచర్‌ను అందిస్తున్న ఏకైక ప్లాట్‌ఫారమ్ తమదేనని పేటీఎం వెల్లడించింది. కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో సహా తొమ్మిది బ్యాంకులు ప్రస్తుతం పేటీఎం లైట్‌ సర్వీసులకు మద్దతు ఇస్తున్నాయి.

ఇక పేటీఎం ద్వారా చేసే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకునుంచి ఎస్‌ఎంఎస్‌, పేమెంట్స్‌ హిస్టరీ అందిస్తారు. ఇదిలా ఉండగా పేటీఎం ప్రవేశపెట్టిన ఈ యూపీఐ లైట్ తొలిసారి యాక్టివేట్ చేసుకున్న వారికి ప్రత్యేకంగా రూ. 100 క్యాష్‌ బ్యాక్‌ అందిస్తోంది. అందువల్ల పేటీఎం యాప్ ఉన్న వారు ఈ యూపీఐ లైట్ ని యాక్టివేట్ చేసుకుని 100 రూపాయల క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఇదే కాకుండా దీంతోపాటు పేటీఎమ్‌ క్యాన్సిల్‌ ప్రొటెక్ట్‌ అనే మరో ఫీచర్‌ను సైతం తీసుకొచ్చింది. దీని ద్వారా విమాన, బస్సు టిక్కెట్ల క్యాన్సిలేషన్‌పై 100 శాతం రీఫండ్‌ అందిస్తుంది. అయితే ఫ్లైట్‌ టికెట్‌ బుకింగ్ కోసం రూ. 149, బస్‌ టికెట్ కోసం రూ. 25 చెల్లించాల్సి ఉంటుంది.