పుడ్ పాయిజనింగ్ బారిన పడితే తస్మాత్ జాగ్రత్త.. ఈ తప్పులు మాత్రం అస్సలు చేయొద్దు!

ఫుడ్ పాయిజనింగ్ నివారించడానికి మరియు దానిని త్వరగా నయం చేయడానికి మీరు కొన్ని చిట్కాలను అనుసరించవచ్చు. ఆహారాన్ని సరిగ్గా ఉడికించి, పరిశుభ్రతను పాటించి, కొద్దిగా అల్లం రసం, తేనె, తులసి ఆకులు వంటివి తీసుకోవడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలను తగ్గించవచ్చు. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ కు సులువుగా చెక్ పెట్టే ఛాన్స్ ఉంది.

మాంసం, చేపలు, కోడిగుడ్లు వంటి ఆహారాలను బాగా ఉడికించి తినాలి. పండ్లు, కూరగాయలు, సలాడ్లు వంటి ఆహారాలను శుభ్రంగా కడిగి, ముడి ఆహారం మరియు వండిన ఆహారం కోసం వేరు వేరు కట్టింగ్ బోర్డులు, కత్తులు, స్పూన్లను ఉపయోగించాలి. ఆహారం తయారు చేసే ముందు, తిన్న తర్వాత చేతులను సబ్బు, నీటితో బాగా కడుక్కోవాలి. మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్ లో నిల్వ చేయడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే ఛాన్స్ ఉండదు.

పాశ్చరైజ్ చేయని పాలు తాగడం మంచిది కాదు. మీకు ఏదైనా ఆహారం పట్ల అలర్జీ ఉంటే, ఆ ఆహారాన్ని తినడం మానుకోవాలి. మీకు జ్వరం, రక్తపు విరేచనాలు, డీ హైడ్రేష లక్షణాలు ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. కొద్దిగా అల్లం రసం, తేనె కలిపి తాగడం వల్ల కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటివి తగ్గుతాయి. తులసి ఆకులను నమిలి తినడం లేదా తులసి టీ తాగడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ నయం అవుతుంది.

అరటిపండ్లు, యాపిల్స్ వంటి పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల డయేరియా, కడుపునొప్పి తగ్గుతాయి. ఫుడ్ పాయిజనింగ్ సమయంలో ద్రవాలు ఎక్కువగా తాగడం ద్వారా డీ హైడ్రేషన్ ను నివారించవచ్చు. ఉప్పు, బిస్కెట్లు, బ్రెడ్ వంటి ఆహారాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. ఈ పానీయాలు జీర్ణవ్యవస్థకు ఆటంకం కలిగిస్తాయి, వికారం, అతిసారం వంటి లక్షణాలను మరింత తీవ్రం చేస్తాయి. డాక్టర్ సిఫార్సు చేసిన మందులను మాత్రమే వాడాలి.