రాతపరీక్షలేకుండానే భారీగా ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.1,77,000 వేతనంతో?

దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. బీటెక్, ఎంటెక్ చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది.

dvc.gov.in అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 91 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. గేట్ 2023 స్కోర్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా 2023 సంవత్సర అక్టోబర్ 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఈ ఉద్యోగ ఖాళీలలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలు ఏకంగా 37 ఉన్నాయి.

ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (మెకానికల్) ఉద్యోగ ఖాళీలు 29 ఉండగా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (మైనింగ్) ఉద్యోగ ఖాళీలు 10 ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (సివిల్) ఉద్యోగ ఖాళీలు 11 ఉండగా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ సీ&ఐ ఉద్యోగ ఖాళీలు 2, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఐటీ ఉద్యోగ ఖాళీలు 2 ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మేన్ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 300 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంది.

అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా నెలకు రూ.1,77,000 వేతనం లభించే అవకాశం ఉండటంతో నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.