యూపీఏ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా.. అయితే ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి..?

ప్రస్తుతం ప్రపంచం మొత్తం డిజిటల్ మయం అయ్యింది. గతంలో ఆర్థిక లావాదేవీలు జరపడానికి బ్యాంకు కి వెళ్లేవారు. కానీ టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల ఇంట్లో కూర్చొని కేవలం ఫోన్ ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నారు. ఇలా డిజిటల్ ట్రాన్సాక్షన్ లో అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా యూపీఐ ద్వారా ఎక్కువగా మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు.ఇలా యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్లు చేసే సమయంలో చాలామంది తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఈ పొరపాట్లు కారణంగా పెద్ద ఎత్తున మోసానికి గురి కావాల్సి ఉంటుంది. అందువల్ల యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్లు చేసేవారు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడటం మంచిది.

యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు పొరపాటున కూడా యూపీఐ కోసం చెల్లించే నాలుగు లేదా ఆరు అంకెల పిన్ నెంబర్ ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. పొరపాటున ఇలా షేర్ చేయడం వల్ల మీరు పెద్ద ఎత్తున డబ్బు నష్టపోవాల్సి ఉంటుంది. అలాగే యూపీఐ ఆధారిత యాప్ కి కూడా లాక్ పెట్టుకోవడం ఎంతో మంచిది. ఇలాంటి పిన్ విషయంలో మీరు కనుక ఏమాత్రం అశ్రద్ధ వహించిన మీ అకౌంటు మొత్తం ఖాళీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రస్థుత కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజలను అమాయకులను చేసి డబ్బు దోచుకుంటున్నారు.

కొన్ని సందర్భాలలో మీ మొబైల్ నెంబర్ కు ఆఫర్లు ఉన్నాయి అంటూ లింక్ పంపించి లింక్ పై క్లిక్ చేయమని మెసేజ్ చేస్తూ ఉంటారు. మనం నిజంగానే ఆఫర్ వచ్చిందని నమ్మి లింక్ మీద క్లిక్ చేస్తే అంతే సంగతులు. ఈ లింక్ మీద క్లిక్ చేయడం వల్ల సైబర్ నేరగాల చేతిలోకి మీ వ్యక్తిగత డేటా మొత్తం వెళ్ళిపోతుంది తద్వారా మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే పరిస్థితిలు ఏర్పడతాయి. ఇక ప్రతి ఒక్కరు రెండు కంటే ఎక్కువ యూపీఐ యాప్లను ఉపయోగించకపోవడం ఎంతో మంచిది. ఇలా రెండు కన్నా అధికంగా ఉండటం వల్ల మీరు కొన్నిసార్లు గందరగోళానికి గురయ్యే అవకాశాలు ఉండి అధికంగా తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి.