పదో తరగతి అర్హతతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలు.. మంచి వేతనంతో?

ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 484 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 2023 సంవత్సరం మార్చి 31వ తేదీ నాటికి 26 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 28145 రూపాయల వరకు వేతనం లభించనుందని తెలుస్తోంది.

కనీసం పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా ఆన్ లైన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2024 సంవత్సరం జనవరి 9వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది.

సంస్థ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సులువుగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీల గురించి అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ సంఖ్యలో జాబ్ నోటిఫికేషన్లు రిలీజవుతున్నాయి.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రాబోయే రోజుల్లో వేతనం మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుంది. బ్యాంక్ ఉద్యోగం కావాలని కోరుకునే వాళ్లు ఈ జాబ్స్ పై దృష్టి పెడితే మంచిది.