అస్సాం రైఫిల్స్ లో టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

అస్సాం రైఫిల్స్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న మహిళా అభ్యర్థులతో పాటు పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్‌ 19 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

మొత్తం 161 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ప్లంబర్ (మేల్), సర్వేయర్ ఐటీఐ (మేల్‌), లైన్‌మ్యాన్ ఫీల్డ్ (మేల్‌) ఉద్యోగ ఖాళీలతో పాటు ఇతర ఉద్యోగ ఖాళీలను సైతం భర్తీ చేయనున్నారు. పది, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్ తో పాటు ఇతర పరీక్షల ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది.

గ్రూప్-బికి దరఖాస్తు ఫీజు 200 రూపాయలుగా ఉండగా గ్రూప్-సికి దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు,మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉండటం గమనార్హం. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ స్థాయిలో వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుండగా ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలలో వేర్వేరు ఉద్యోగ ఖాళీలు ఉండగా అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.