ఏపీ దేవాదాయ శాఖలో ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

ఏపీ దేవాదాయ శాఖ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీకి సిద్ధమైంది. మొత్తం 70 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగాలలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) ఉద్యోగ ఖాళీలు 35 ఉండగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఎలక్ట్రికల్) ఉద్యోగ ఖాళీలు 5 ఉన్నాయి.

టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) ఉద్యోగ ఖాళీలు మాత్రం 30 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన హిందూ మతస్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. బీఈ, బీటెక్‌ (సివిల్ లేదా ఎలక్ట్రికల్) పాసైన వాళ్లు ఏఈఈ ఉద్యోగాలకు అర్హులు కాగా ఎల్‌సీఈ డిప్లొమా పాసైన వాళ్లు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు ఉండనుంది.

42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. నెలకు ఏఈఈకి రూ.35,000 వేతనం లభించనుండగా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన వాళ్లకు రూ.25,000 తో పాటు అదనపు అలవెన్సు లభించే అవకాశం అయితే ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కాగా ది కన్వీనర్‌, రిక్రూట్‌మెట్‌ సర్వీస్‌, పవర్‌ అండ్‌ ఎనర్జీ డివిజన్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా, గచ్చిబౌలి, హైదరాబాద్‌ అడ్రస్ కు ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి. 2024 సంవత్సరం జనవరి నెల 5వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది.