నెటిజన్లు పై మండిపడుతున్న లేడీ సూపర్ స్టార్ !?

Satish Vignesh and Nayanatara
అవును.. సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార నెటిజనులపై తీవ్రంగా మండిపడుతోంది. అందుకు కారణం లేకపోలేదు. గత కొన్ని రోజులుగా నయనతారపై  సోషల్ మీడియాలో జోరుగా  ప్రచారం జరుగుతోంది. అదంతా పుకారే అని తొలుత కొట్టిపారేసినా తర్వాత్తర్వాత నెటిజనులపై మంది పడక తప్పలేదు.
 
ఈ విషయం గురించి నయనతార నోరు విప్పక తప్పలేదు.  ‘నయనతార ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ లు మహమ్మారి వైరస్ బారిన పడ్డారు’ అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం వారిద్దరు కూడా క్వారెంటైన్ లో ఉన్నారు అనేది ఆ పుకారు సారాశం.
 
ఇదంతా చూసిన నయనతార తీవ్రంగానే చలించింది. సోషల్ మీడియాలో ఇంత ఘోరంగా కూడా కామెంట్లు పెడతారా? అంటూ తీవ్ర మనో వేదనకు గురైంది.  సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై నయనతార  విభిన్నమైన శైలిలో స్పందించింది.
 
తామిద్దరం ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నామని తమకు ఎలాంటి అనారోగ్య సమస్య లేదని మీడియాలో వస్తున్న వార్తలు అన్ని కూడా కేవలం పుకార్లే అని కొట్టిపారేసింది.  మా గురించి పుకార్లు పుట్టించే వారు వేస్ట్ ఫెలోస్ అని కుడా వ్యాఖ్యానించింది. వారు చేస్తున్న జోక్స్ ను చూసి నవ్వుకున్నట్టుకూడా చెప్పింది.  
 
ఈ ఏడాదిలో  అతి తక్కువ మంది సమక్షంలో ఒక గుడిలో నయనతార-విఘ్నేష్ శివన్ లు పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు వీరు పెళ్లి విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే నయనతార ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ లు మాత్రం  పెళ్లి పీటలెక్కేందుకు  యమజోరుగా రెడీ అవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది! అదీ .. సంగతీ!?