సీక్రెట్ గా మర్డర్స్ తో శృతిహాసన్ కు వరల్డ్ వైడ్ గా గుర్తింపు

ఇన్నాళ్లూ టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌లో నటిగా సందడి చేసిన శృతిహాసన్ ఇప్పుడు ఇంటర్నేషనల్ వెబ్‌సిరీస్‌లో నటించబోతున్నారు. అమెరికాకు చెందిన ‘ట్రెడ్‌స్టోన్‌’లో శ్రుతి కీలక పాత్రను పోషించబోతున్నారు. ఇందులో ఆమె వెయిట్రెస్‌గా కనిపిస్తూ సీక్రెట్ గా హత్యలు చేసే అమ్మాయి పాత్రలో కనిపించనున్నారట.

ఈ ఎపిసోడ్‌కు రామిన్ బహ్రానీ దర్శకత్వం వహిస్తున్నారు. అమెరికా, భారత్‌లో ఈ ఎపిసోడ్‌ షూటింగ్ జరగనుందట. ఈ ప్రాజెక్టు శ్రుతికి మంచి అవకాశం అనే చెప్పాలి. శ్రుతి కెరీర్లో అత్యంత పెద్ద ప్రాజెక్ట్ ఇదే. ఈ సీరీస్ స‌క్సెస్ అయితే క‌నుక‌, ప్రియాంక చోప్రాకు వ‌చ్చినంత పేరు శ్రుతిహాస‌న్‌కు కూడా వ‌స్తుంది. దీంతో ఆమెకు ఇంటర్నేషనల్ గా గుర్తింపు లభిస్తే.. హాలీవుడ్‌ సినిమాల్లో అవకాశం వచ్చే ఛాన్స్‌ ఉంది.

మ‌రోవైపు ర‌వితేజ సినిమా కోసం కూడా రీసెంట్ గా శ్రుతిని సంప్ర‌దించిన విష‌యం తెలిసిందే. అయితే శ్రుతి ఇప్పుడు రెండింటికీ కాల్షీట్ అడ్జ‌స్ట్ చేస్తుందా అనేది ప్రశ్నార్దకంగా మారింది. ‘కాటమరాయుడు’ తర్వాత శ్రుతి తెలుగులో సినిమా చేయలేదన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే చాలా గ్యాప్ తర్వాత శ్రుతి తమిళంలో ఓ ప్రాజెక్టుకు సైన్ చేశారు. విజయ్‌ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.