వేసవిలో అరుదుగా దొరికే మొర్రి పండ్ల ఆరోగ్య రహస్యాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సింది!

కేవలం అటవీ ప్రాంతాల్లో మాత్రమే అరుదుగా లభించే మొర్రి పండ్లు తినటానికి తీపి,పులుపు రుచుల కాంబినేషన్లో అద్భుతంగా ఉండడంతో పాటు ఎన్నో పోషక విలువలు,ఔషధ గుణాలు పుష్కలంగా లభిస్తాయని చెబుతుంటారు. ముఖ్యంగా మొర్రి పండ్లు విశాఖ ఏజెన్సీ,ఆదిలాబాదు, శ్రీకాకుళం గిరిజన అటవీ ప్రాంతాల్లో మాత్రమే విరివిగా లభిస్తాయి.మొర్రి పండ్ల ను ఇంగ్లీష్ చిరోంజి ఫ్రూట్ అని అంటారు. ఇతర ప్రాంతాల్లో నురామరం, చంహ్రా, కోల్ మావు అనే రకరకాల పేర్లతో పిలుస్తుంటారు.
మొర్రి పండ్లను బొటానికల్ నేమే బుంచనానియా లాటిఫోలియా.ఈ పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో, దోరగా మాగినప్పుడు ఎరుపు రంగులో పూర్తిగా పక్కవానికి వచ్చినప్పుడు నలుపు రంగులో కనిపిస్తాయి.

మొర్రి పండ్లలో ఒక గింజ మాత్ర‌మే ఉంటుంది.ఈ గింజలు డ్రై ఫ్రూట్ గా మార్కెట్‌‌లో కూడా లభ్యమవుతాయి.మొర్రి పండ్లు బాగా పండిన తర్వాత విత్తనంతో సహా అలాగే తినేయొచ్చు. మొర్రి పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మొర్రి పండ్లలో సమృద్ధిగా విటమిన్ సి, విటమిన్ ఎ,విటమిన్ బి1, బి2,నియాసిన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పీచు పదార్థం, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా లభిస్తాయి.

వేసవిలో దొరికే మొర్రి పండ్లు మన శరీరాన్ని చల్లబరిచే సహజ గుణాలు పుష్కలంగా ఉన్నాయి కావున వీటిని తింటే డిహైడ్రేషన్ సమస్య నుంచి రక్షణ పొందవచ్చు. మరియు మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడంలో సహాయపడతాయి. పీచు పదార్థం అధికంగా ఉండడం జీర్ణశక్తి మెరుగుపడి మలబద్ధకాన్ని తొలగించి పొట్టని శుభ్రంగా ఉంచుతుంది.డయేరియా తో బాధపడేవారు ఈ పండ్లను తింటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా కాలేయం ఆరోగ్యాన్ని రచించడంలో ఎలక పాత్ర పోషిస్తుంది. రక్తంలో గ్లూకోస్థాయిలను నియంత్రించి డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది.