Raw Mango: ప్రతిరోజు పచ్చిమామిడికాయలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఎండాకాలం వచ్చింది అంటే చాలు మనకు బయట ఎక్కడ చూసినా కూడా మామిడి పండ్లు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. అయితే కొందరు మామిడి పండ్లు తినడానికి ఇష్టపడితే మరికొందరు పచ్చి మామిడి కాయలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే మామిడి ఆరోగ్యానికి చాలామంచిదే కానీ అలా అని ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవు. కొందరు వేసవిలో పచ్చి మామిడి కాయలు ఎక్కువగా తింటూ ఉంటారు. రోజూ తింటుంటారు. కానీ రోజూ మామిడి కాయలను తింటే ఎన్నో సమస్యలు వస్తాయట. మరీ పచ్చి మామిడి ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పచ్చి మామిడికాయలను అలాగే లేదా పప్పు, చారు, పచ్చడి వంటి ఎన్నో వంటల్లో వేసి తింటుంటారు. కానీ పచ్చిమామిడి కాయలను ఎక్కువగా తింటే కడుపు నొప్పి వస్తుంది. అలాగే విరేచనాలు అవుతాయి. ఎసిడిటీ సమస్యలు కూడా వస్తాయి. మామిడి పండుతో పాటుగా పచ్చి మామిడిలో కూడా వేడి చేసే గుణాలు ఉంటాయి. అందుకే వీటిని ఎక్కువగా తింటే శరీరంలో వేడి బాగా పెరుగుతుంది. దీనివల్ల నోట్లో బొబ్బలు ఏర్పడతాయి. అలాగే మొటిమలు కూడా వస్తాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారు పచ్చి మామిడి కాయలను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇది మీ సమస్యను మరింత పెంచుతుంది.

పచ్చి మామిడికాయను మోతాదుకు మించి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గుతాయి. పచ్చి మామిడి కాయలు మన దంతాల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే పచ్చిమామిడికాయ లోని పులుపు దంతాల సున్నితత్వాన్ని దెబ్బతీస్తుంది. చిగుళ్లలో నొప్పిని కూడా కలిగిస్తుంది. అందుకే పచ్చి మామిడి కాయలను ఎక్కువగా తినకూడదు. పచ్చిమామిడి కాయలను ఎక్కువగా తింటే గొంతు నొప్పి వస్తుంది. అలాగే గొంతు ఇన్ఫెక్షన్ సమస్య కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే దీన్ని మరీ ఎక్కువగా తినకూడదు. వేసవిలో కేవలం పచ్చి మామిడికాయలు మాత్రమే కాకుండా మామిడి పండ్లు కూడా ఎక్కువగా తినకూడదు.