మన శరీరానికి రక్తం ఎంత అవసరమో రక్తంలో సరిపడా స్థాయిలో హిమోగ్లోబిన్ ఉండటం కూడా అంతే అవసరం. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటే మన శరీర అవయవాలకు ఆక్సిజన్ సరిగా అందదు. అందువల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ముఖ్యంగా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నప్పుడు రక్తంలో ఐరన్ లోపం ఏర్పడి రక్తహీనత వంటి సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల ఎప్పుడు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గకుండా ఉండేలా చూసుకోవాలి. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరగటానికి తీసుకోవలసిన ఆహారపదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకుకూరలు, కూరగాయలు మన ఆరోగ్యానికి కావాల్సిన అనేక రకాల పోషకాలను అందిస్తాయి. ముఖ్యంగా పాలకూర, బచ్చలి కూర వంటి ఆకుకూరలు ప్రతిరోజు తినటం వల్ల ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరగటానికి దోహదపడతాయి. పాలకూరలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పాలకూరను ప్రతిరోజు తినటం వల్ల రక్తంలో ఐరన్ శాతం పెరిగి హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. ఇక ప్రతిరోజు బచ్చలి కూర తినటం వల్ల శరీరంలో రక్త శాతం పెరిగి రక్తహీనత సమస్య దరిచేరకుండా కాపాడుతుంది.
బీట్రూట్ తో చేసిన ఆహార పదార్థాలను కానీ బీట్రూట్ రసాన్నికాన్ని ప్రతిరోజు తాగటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. ఇక విటమిన్ సి ఎక్కువగా ఉన్న నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి పండ్లు తినడం వల్ల ఐరన్ కాల్షియం వంటి పోషకాలు మన శరీరానికి సమృద్ధిగా లభిస్తాయి. తద్వారా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. అంతేకాకుండా దానిమ్మ పళ్ళ రసాన్ని కూడా ప్రతిరోజు తాగటం వల్ల శరీరంలో రక్త శాతం పెరుగుతుంది. పాలు, గుడ్లు, మాంసాహారం వంటి ఆహార పదార్థాలు తినటం వల్ల వాటిలో ఉండే ఐరన్ శాతం రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి.
