ఓంకార్ కు ఓ రేంజిలో ట్విస్ట్ ఇచ్చిన తమన్నా

యాంకర్ గా సక్సెస్ అయ్యి దర్శకుడిగా పరిచయం అయిన ఓంకార్‌ రాజుగారి గది సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. దీంతో అదే జానర్‌లో నాగార్జున, సమంత ప్రధాన పాత్రల్లో రాజుగారి గది 2 చిత్రాన్ని తెరకెక్కించిన మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అదే ట్రెండ్‌ ను కంటిన్యూ చేస్తూ రాజుగారి గది 3ని తెరకెక్కిస్తున్నాడు ఓంకార్‌. రాజుగారి గది 3లో హీరోయిన్​గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోందని టీమ్ ప్రకటించింది. కానీ తమన్నా ఈ సినిమానుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది.

దాంతో తమన్నా హఠాత్తుగా ఈ మూవీకి నో చెప్పటానికి కూడా కారణం ఏమిటి అనేది చర్చనీయాంశంగా మారింది. తమన్నా షెడ్యూల్ దొరకని బిజీ స్టేజ్ లో ఉంటే నో చెప్పిందంటే అర్దం చేసుకోవచ్చు. అయితే ఇప్పడు ఆమె చేతిలో పెద్దగా సినిమాలేమీ లేవు. అయినా కూడా సినిమాకు నో చెప్పడానికి బలమైన కారణం ఉందని సమాచారం.

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. తమన్నా ఫర్మిషన్ లేకుండా మొదట చెప్పిన స్క్రిప్ట్ కాకుండా మార్పులు చేశారని. ఆమెకు మార్పు చేసిన స్క్రిప్ట్ నచ్చకపోవడంతో సినిమా చేయనని చెప్పేసిందట. తమన్నాకు స్టోరీ నచ్చడం వల్ల ఆరు నెలల క్రితమే ఈ సినిమాకు ఓకే చెప్పేసింది. అయితే ఈ ఆరు నెలల కాలంలో దర్శకుడు సినిమా స్క్రిప్ట్ మొత్తం మార్చడంతో తమన్నా నో చెప్పేసింది. అయితే లాస్ట్ మినిట్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్లే సమయంలో ఆమె చేయటంతో ఓంకార్ తలపట్టుకుని మరో హీరోయిన్ కోసం ట్రైల్స్ లో పడ్డారట.

అశ్విన్‌ బాబు హీరోగా నటిస్తున్న ఈసినిమాలో ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, హరితేజ, ప్రభాస్‌ శ్రీను, అజయ్‌ ఘోష్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓంకార్‌ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.