శ్రీను వైట్ల ఈ కొత్త ట్విస్ట్ ఏంటి?

వరుస ప్లాఫ్ లతో సతమతం అవుతూ, రీసెంట్ గా అమర్ అక్బర్ ఆంటొని చిత్రం తో కెరీర్ లో మరో డిజాస్టర్ ను ఖాతాలో వేసుకున్న శ్రీను వైట్ల తన తదుపరి ప్రాజెక్ట్ ఏ హీరోతో చెయ్యబోతున్నారనేది అంతటా చర్చనీయాంశంగా మారింది. అయితే అందరి అంచనాలను ఆయన తలక్రిందులు చేయదలుచుకున్నారు.

అందుతున్న సమాచారం మేరకు శ్రీను వైట్ల ఇప్పుడు వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. ఇక ఇప్పటికే దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యిందని సమాచారం. ఈ వెబ్ సిరీస్ కు ‘ఆనందం’ అనే టైటిల్ ను ఖరారు చేశారట. తర్వలోనే ఈ వెబ్ సిరీస్ పట్టాలు ఎక్కనుంది. ఈ మేరకు ఎనౌన్సమెంట్ రానుంది.

అంతేకాదు శ్రీనువైట్ల తనకు కామెడీ డైరక్టర్ గా బ్రేక్ ఇచ్చిన ఢీ సినిమా హీరో మంచు విష్ణుతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అది కూడా ఢీ సీక్వెల్ అని తెలుస్తోంది. విష్ణు సొంతం బ్యానేర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సినిమా గురించి తర్వలోనే అధికారిక ప్రకటన వెలుబడనుంది.