బాలీవుడ్ ఆఫర్ ని తిరస్కరించిన రష్మిక

తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నకు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. అయితే ఆ ఆఫర్‌ను ఆమె సున్నితంగా తిరస్కరించిందట. తెలుగులో నానీ హీరోగా నటించిన ‘జెర్సీ’ షాహిద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా రష్మికను చేయాలని కోరారట. అయితే రష్మిక అందుకు నో చెప్పిందట. ఈ సినిమాను చేయలేనని, తన పాత్రకు న్యాయం చేయలేనని తేల్చి చెప్పిందట. దీంతో చేసేందేమి లేక చిత్రయూనిట్ మరో హీరోయిన్‌ను వెతుక్కునే పనిలో పడిందట.అయితే , రష్మిక ఈ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చినా పక్కన పెట్టేసింది. రెమ్యునరేషన్ వల్లే రష్మిక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. అయితే వీటిపై రష్మిక వివరణ ఇచ్చింది. “సినిమా అంటే డబ్బు మాత్రమే కాదు. ఆ సినిమా కోసం మనం ఎంత కష్టపడ్డామనేదే ముఖ్యమైన విషయమ”ని రష్మిక చెప్పింది