‘మిస్ట‌ర్ మ‌జ్ను’ ట్రైలర్ పై చెర్రీ కామెంట్, ‘ఆరెంజ్’ గుర్తొచ్చిందా?!

అఖిల్ అక్కినేని నటించిన మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’ యొక్క ట్రైలర్ ఇటీవల విడుదలై 6 మిలియన్ల వ్యూస్ ను రాబట్టి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ చిత్రం చూసిన వారంతా రామ్ చరణ్ ప్లాఫ్ చిత్రం ఆరెంజ్ ని గుర్తు చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో తాజాగా ఈ ట్రైలర్ ను చూసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉందని అఖిల్ తో పాటు చిత్ర యూనిట్ కు తన పేస్ బుక్ ద్వారా అల్ ది బెస్ట్ తెలియజేయటం అంతటా హాట్ టాపిక్ గా మారింది. అంటే రామ్ చరణ్ కూడా అలాగే తన చిత్రం లాగే ఈ సినిమా కూడా ఉందనుకున్నారా…అని కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో.

కంటెంట్ పరంగా ఆ సినిమా గుర్తుకు వస్తోందని, ప్రేమ దాకా ఓకే పెళ్లి అంటే కష్టం అంటూ కమిట్మెంట్ దూరంగా ఉండే పాత్రను అఖిల్ చేస్తున్నాడని, అదే రామ్ చరణ్ ..ఆరెంజ్ లో చేసాడు అంటున్నారు. అప్పట్లో ఆ థీమ్ కొంతమందికి కుర్రాళ్లకు నచ్చినా …ఎక్కువ మంది కనెక్టు కాలేకపోయారని, కాలం మారింది కాబట్టి ఈ సారి వర్కవుట్ అవుతుందేమో అంటున్నారు.

‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా తమన్ సంగీతం అందించారు. ఎస్విసిసి పతాకం ఫై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 25న విడుదలకానుంది. ఇక ‘అఖిల్ , హలో’ చిత్రాల తో హిట్ అందుకోలేకపోయిన అఖిల్ ఈ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. మరో వైపు ఈ చిత్రానికి సోలో రిలీజ్ కూడా కలిసిరానుంది. మరి ఈ చిత్రంతోనైనా అఖిల్ మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడోలేదో చూడాలి.