దగ్గరుండి రిపేర్లు చేయిస్తున్న రాజమౌళి

 
దగ్గరుండి ఆ సినిమాకు రిపేర్లు చేయిస్తున్న రాజమౌళి

రాజమౌళి కు దర్శకుడుగా ఎంత పేరుందో తెలిసిందే. ఆయన సినిమా బాగుందంటూ చిన్న ట్వీట్ చేస్తేనే ఆ చిత్రానికి కలెక్షన్స్ ఊపందుకుంటాయి. అలాంటిది ఆయనే దగ్గరకుండి సినిమాని చూసి, రిపేర్లు చేస్తే ఎలా ఉండబోతుంది. క్రేజ్ ఏ రకంగా ఉంటుంది. ఇప్పుడదే జరగబోతోంది. తన సొంత సినిమా ఆర్ ఆర్ ఆర్ తో పాటు ఆయన మరో సినిమాపై దృష్టి పెట్టారు. ఈ విషయం ఇప్పుడు ట్రేడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

వివరాల్లోకి వెళితే.. రాజమౌళి కుమారుడు కార్తికేయ ప్రస్తుతం ‘ఆకాశవాణి’ అనే చిత్రంతో నిర్మాతగా వెండితెరకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దగ్గరే దర్శకత్వ శాఖలో పనిచేసిన అశ్విన్‌ గంగరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఓ వైవిధ్యమైన పీరియాడిక్‌ కథాంశంతో నూతన నటీనటులతో ఈ చిత్రం రూపొందుతోంది. రీసెంట్ గా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని రాజమౌళి చూడటం జరిగింది.

దాంతో ప్రస్తుతం ఈ సినిమా కోసం రాజమౌళి తనదైన స్టైల్ లో మార్పులు చేయిస్తున్నారట. కథ రిత్యా ఈ చిత్రంలో హీరో కన్నా విలన్ పాత్రకే ఎంతో ప్రాధాన్యముంటుందట. కీలకమైన ఈ పాత్రను ఓ కొత్త నటుడితో పూర్తి చేసిందట చిత్ర యూనిట్. అయితే తాజాగా ఈ చిత్ర అవుట్‌ పుట్‌ చూసినన రాజమౌలికు ఆ పాత్ర అంతగా ఇంప్రిసివ్ గా అనిపించలేదట. అందుకే ఇప్పుడాయన సూచనల మేరకు మరో కొత్త నటుడితో ఆ పాత్రను తిరిగి షూట్ చేసారట. ఇప్పటికే అందుకు సంబంధించిన షూట్‌ కూడా చివరి దశకు చేరుకుందట.

త్వరలోనే చిత్ర ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే అక్టోబరులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది. ఈ చిత్రానికి కీరవాణి తనయుడు కాలభైరవ స్వరాలు సమకూర్చుతుండగా.. బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు రాస్తున్నారు.