‘సీత’సెట్ నుండి తేజ వాకౌట్..కారణం బెల్లంకొండ ?

మొదట నుంచి దర్శకుడు తేజ ది తను ఎలా అనుకుంటే అలాంటి అవుట్ పుట్ వచ్చేదాకా శ్రమించే మనస్తత్వం. ఆయన అందుకోసం ఆర్టిస్ట్ ల మీద కోపపడటం, కొట్టడం వంటివి కూడా చేసారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆయన సినిమా కోసమే కోప్పడతారనే విషయం తెలుసు కాబట్టి ఎవరూ దాన్ని వ్యక్తిగతంగా మనస్సుకు తీసుకోరు. తాజాగా అలాంటి విభేదమే..బెల్లంకొండ శ్రీనివాస్ తో చేస్తున్న సీత సెట్ లో వచ్చిందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఆ సెట్స్ పై నుంచి తేజ వాకౌట్ చేసారని ప్రచారం జరుగుతోంది.

అయితే అందుకు రీజన్ మాత్రం చిత్రంగా ఉంది. హీరోని తాను గడ్డం పెంచాల్సిందిగా కోరితే ఆ పనిని చేయలేకపోయాడట. దాంతో తేజ సీరియస్ అయ్యి సెట్స్ నుంచి వాకౌట్ చేశాడని చెప్తున్నారు. అయినా ఈ సినిమా షూటింగ్ ఆగదు.. మొత్తం పూర్తి చేస్తానని తేజ అన్నారట. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ గెడ్డం పెంచే పనిలో ఉన్నారా అంటే..అదేమీ లేదంటున్నారు. ఆ గడ్డాన్ని సీజీ వర్క్ లో మ్యానేజ్ చేస్తారని చెప్పుకుంటన్నారు. ఇందులో నిజా నిజాలు తేజకు, బెల్లంకొండకు టీమ్ కు తెలియాలి.

బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజల్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సీత’. ‘నేనే రాజు నేనే మంత్రి’ హిట్‌ తర్వాత దర్శకుడు తేజ తీస్తున్న చిత్రమిది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అనూప్‌ రూబెన్స్‌ బాణీలు అందిస్తున్నారు. ఇందులో కాజల్‌ ‘సీత’ అనే పాత్రలో సందడి చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 25న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకటించింది.

ఈ సినిమాలో సోనూసూద్‌, మన్నారా చోప్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్‌ తుది దశలో ఉందని నిర్మాతలు తెలిపారు. ‘కవచం’ తర్వాత కాజల్‌, బెల్లంకొండ కలిసి నటిస్తున్న రెండో చిత్రం ‘సీత’. తేజ, కాజల్‌ కాంబినేషన్‌లో విడుదల కాబోతున్న మూడో చిత్రం కావడం విశేషం.