అమలాపాల్ ని అడ్డం పెట్టి హీరోని అవమానించారు

అమలా పాల్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని ఘోరంగా అవమానించిందంటూ వార్తలు మీడియాలో వచ్చిన సంగతి తెలిసిందే . ఇంతకీ ఈ భామ ఈ హీరోని ఎందుకు అవమానించిందని ఆ వార్తల్లో రాసారంటే.. తమిళంలో విజయం సాధించిన రాక్షసన్ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ” రాక్షసుడు ” గా రీమేక్ చేస్తున్నారు .రైడ్ , వీరా వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. కాగా తమిళంలో అమలా పాల్ – విష్ణు విశాల్ జంటగా నటించారు .

విష్ణు విశాల్ లా నటించడం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వల్ల కాదని ఒక్క ముక్కలో అనేసి అవామానం చేసేసింది అమలా పాల్ అని వార్తల సారాంశం . అయితే నిజంగానే అమలాపాల్ ఆ మాటలు అందా..ఎక్కడ..ఎప్పుడు అనేది చాలా మంది మీడియా జనాలకు అక్కర్లేకపోయినా సినీ ప్రేమికులకు కావాల్సి వచ్చాయి. దాంతో చివరకు తేలిందేమిటంటే..అది మీడియా పుట్టించిన రూమరే అని. ఎవరో తమ మనస్సులో ఉన్న అభిప్రాయాన్ని ఇలా అమలాపాల్ మీదకు తోసేసి వార్త రాసేసారన్నమాట.

ఇక రాక్షసన్ లో అమలా పాల్ చేసిన పాత్రలో తెలుగులో అనుపమా పరమేశ్వరన్ నటిస్తోంది . విష్ణు విశాల్ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్నాడు . అయితే తమిళంలో రాక్షసన్ సంచలన విజయం సాధించింది అలాగే విష్ణు విశాల్ నటనకు జేజేలు పలికారు .