రజనీ పై వైరల్ న్యూస్: ఇది రూమరా..నిజమా?

రజనీ కాంత్ వంటి సూపర్ స్టార్స్ గురించి చదవాలని ,వినాలని వాళ్ల అభిమానులకు చాలా ఆసక్తిగా ఉంటుంది. అంత మాత్రాన రోజూ ఎక్కడ వార్తలు ఉంటాయి. దాంతో మీడియా వాళ్లే స్వయంగా ఓ వార్తను వండి వడ్డిస్తూంటారు. ఆ వార్తలు చాలా భాగం రూమర్స్ గానే మిగిలిపోతూంటాయి. అయితే అప్పుడప్పుడూ నిజాలు బయిటకు లీక్ అవుతాయి. అప్పుడు ఏది నిజం..ఏది అబద్దం అనేది అర్దం కాకుండాపోతుంది. తాజాగా రజనీకాంత్ గురించిన మరో వార్త తమిళ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందులో నిజమెంతో చూద్దాం…

రోబో 2.0 తో రీసెంట్ గా మన ముందుకు వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ జనవరిలో పెటా మూవీతో మనని పలకరించారు. ప్రస్తుతంరెస్ట్ తీసుకుంటున్న రజనీకాంత్ తన తదుపరి మూవీని మురగదాస్ తో చేయనున్నాడు.. సర్కార్ మూవీతో విజయ్ మరో బ్లాక్ బస్టర్ ఇచ్చిన మురగదాస్ ఈసారి రజనీకాంత్ కి ఒక విభిన్నమైన కథను చెప్పాడట.. కథ నచ్చడంతో ఓకే చెప్పి డేట్స్ ఫైనల్ చేసినట్లు టాక్.. అనిరుధ్ సంగీతం సమకూర్చే ఈ మూవీ మార్చి నుంచి సెట్స్ కి వెళ్లనుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో రజనీ చేయబోయే పాత్రపై రకరకాల వార్తలు మొదలయ్యాయి.

మొదట రాజకీయ నేపథ్యంలో దీన్ని తీస్తున్నారని, ఇందులో రజనీ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారని చెప్పుకొచ్చారు. తర్వాత ఫాంటసీ కథాంశంతో రూపొందిస్తున్నట్లు రూమర్లు వచ్చాయి. కాగా ఇప్పుడు మరో కొత్త ప్రచారం జరుగుతోంది. ఇందులో రజనీ పోలీసు అధికారిగా నటించబోతున్నట్లు సమాచారం. ఈ రూమర్ కనుక నిజమైతే రజనీ దశాబ్దాల తర్వాత పోలీసు అధికారిగా నటిస్తున్న చిత్రమిది అవుతుంది.

రజనీకాంత్ గతంలో పోలీసుగా నటించిన ‘మూన్‌డ్రు ముగమ్‌’, ‘పాండియన్‌’, ‘కోడి పరాకుథు’ తదితర సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించాయి. ఈ సినిమాలో ఆయనకు జోడీగా కీర్తి సురేశ్‌ నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.