UPI New Rule: యూపీఐ న్యూ రూల్స్: ఫిబ్రవరి 1 నుంచి కీలక మార్పులు

యూపీఐ ద్వారా లావాదేవీలు నిర్వహించే వారికి త్వరలో కొన్ని కీలక మార్పులు ఎదురుకానున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా యూపీఐ లావాదేవీలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఫిబ్రవరి 1, 2025 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్పుల ప్రకారం, ట్రాన్సాక్షన్ ఐడీలలో @, #, & వంటి ప్రత్యేక అక్షరాలు ఉంటే ఆ లావాదేవీలు స్వీకరించబడవు.

ఈ నిబంధనలను ఉల్లంఘించే యూపీఐ యాప్‌లు తగిన చర్యలకు గురికావచ్చని NPCI స్పష్టం చేసింది. వినియోగదారుల భద్రతను పెంచడం, నకిలీ లావాదేవీలను అరికట్టడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని NPCI తెలిపింది. ఇకపై లావాదేవీల ట్రాకింగ్ మరింత క్రమబద్ధంగా సాగనుండగా, ఆల్ఫాన్యూమెరిక్ (అక్షరాలు, సంఖ్యలు) ఐడీలను మాత్రమే గుర్తించేలా యూపీఐ వ్యవస్థ రూపొందించబడింది.

గత కొన్ని నెలల్లో యూపీఐ లావాదేవీల సంఖ్య భారీగా పెరిగింది. డిసెంబర్ 2024లో 16.73 బిలియన్ లావాదేవీలు నమోదవ్వగా, వీటి విలువ రూ. 23.25 లక్షల కోట్లకు చేరింది. రోజువారీ లావాదేవీలు కూడా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో NPCI భద్రతాపరమైన మార్పులకు ప్రాధాన్యత ఇస్తోంది. వినియోగదారులు తమ యాప్‌లను నవీకరించుకోవడంతో పాటు, కొత్త మార్గదర్శకాలను పాటించాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 1 తర్వాత యూపీఐ లావాదేవీలు నిరాడంబరంగా సాగాలంటే, NPCI నిర్దేశించిన విధానాలను తప్పనిసరిగా అనుసరించాలి.

అఘోరి అంత బోగస్  || Social Activst Krishna Kumari EXPOSED Lady Aghori Naga Sadhu || Telugu Rajyam