అనంతపురం జిల్లాలో పెళ్లింట విషాదం (వీడియోలు)

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుగొండ మండలం సత్తారుపల్లి వద్ద  మినీ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా ఏడుగురికి గాయాలయ్యాయి. ధర్మవరంలో జరిగే పెళ్లికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను అనంతపురం ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. పెళ్లికి వెళుతున్న వేళ ప్రమాదం జరగడంతో అంతా విషాదంలో మునిగిపోయారు. మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గురైన వారి వీడియోలు కింద ఉన్నాయి చూడండి.