ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో భేటీ అవ్వడానికి టాలీవుడ్ ప్రముఖులు సర్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈనెల 9న భేటీ నిర్వహించడాని జగన్ అపాయింట్ మెంట్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే టాలీవుడ్ నుంచి ఎవరెవరు వస్తారు? అన్న వివరాలతో కూడిన జాబితా కూడా జగన్ టేబుల్ ముందుకు వెళ్లిందిట. ఎగ్జిబిటర్, నిర్మాత, స్టూడియో, డిస్ర్టిబ్యూటర్ సర్కిల్స్ నుంచి ఇద్దరు చొప్పునా, అలాగే ఫెడరేషన్, మా, డైరెక్టర్ విభాగాల నుంచి ఇద్దరేసి చొప్పున భేటీలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఇక మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు, మోహన్ బాబు, కృష్ణంరాజు , త్రివిక్రమ్, రాజమౌళి, పరుచూరి బ్రదర్స్ సహా కొంత మంది అగ్ర దర్శకులు, నిర్మాతలు సహా నరేష్, జీవిత, రాజశేఖర్ లను కూడా ఆహ్వానించినట్లు సమాచారం.
వీరందరికీ సంబంధించి ఓ జాబితా సిద్దమైందిట. ఆ వివరాలు ఇప్పటికే ముఖ్యమంత్రికి చేరుకుందని సమాచారం. వీరంతా రోడ్డు మార్గం ద్వారా అమరావతి వచ్చి ముఖ్యమంత్రి క్యాంప్ అఫీస్ లో భేటీ కానున్నారని తెలిసింది. అయితే ఈ భేటిలో నటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొంటారా? లేదా? అన్న దానిపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. పరిశ్రమ నుంచైతే బాలయ్యకు పిలుపు చేయడం జరిగిందట. కానీ ఆయన ఎలా స్పందించారు? అన్న దానిపై కూడా స్పష్టత లేదు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
వైజాగ్ లో సినిమా ఇండస్ర్టీ డెవలప్ మెంట్ ఎలా? ప్రభుత్వం తరుపు నుంచే అందించే ప్రోత్సాహాకాలు ఎలా ఉంటాయి? చంద్రబాబు హయాంలో కేటాయించిన భూముల పరిస్థితి ఏంటి? ఇప్పటికే అభివృద్ది పరంగా వెళ్లూనుకున్న వైజాగ్ ని ఫిల్మ్ హబ్ గా మార్చాలంటే తీసుకోవాల్సిన చర్యలేంటి? వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వచ్చిన నష్టాలను పూడ్చడం ఎలా? థియేటర్లు పున ప్రారంభించడంపై ప్రధానంగా చర్చ జరగనుందని సమాచారం. జగన్ అపాయింట్ మెంట్ దొరకడం అనేది చీటికిమాటికి జరిగే పని కాదు. అలాగే సినిమా వాళ్లంతా ఒకేసారి కలవడం కూడా ప్రతీసారి జరిగే పని కాదు.
అందుకే జగన్ తో జరిగే భేటీలో పరిశ్రమ అభివృద్దికి సంబంధించి అన్ని విషయాలపైనా కూలంకుశంగా చర్చించనున్నట్లు సమాచారం. ఈభేటిలో పరిశ్రమ తరుపు నుంచి నాగార్జున లీడ్ తీసుకుంటారని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. అలాగే అక్కినేని ఫ్యామిలీ నుంచి సుమంత్ కూడా హాజరవుతున్నట్లు సమాచారం. సుమంత్-జగన్ క్లాస్ మేట్స్. మంచి స్నేహితులు కూడా. మరి ఈ బేటీలో సుమంత్ పాత్ర ఎలా ఉంటుందన్నది వేచి చూడాలి.