కొత్త మండలాల ఏర్పాటులో భాగంగా యాదాద్రి జిల్లాలోని గట్టుప్పల్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేసి చివరి నిమిషంలో మండల ఏర్పాటును ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో అప్పటి నుంచి గట్టుప్పల్ గ్రామ ప్రజలు నిరవధిక దీక్షలు చేస్తూ తమ నిరసనను తెలుపుతున్నారు. మండలాన్ని ఇస్తావా… చస్తావా.. అంటూ కొత్తపేటలోని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు గట్టుప్పల్ గ్రామ ప్రజలు ఆందోళన నిర్వహించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గట్టుప్పల్ గ్రామ ప్రజలు ఆందోళన చేసిన వీడియోలు కింద ఉన్నాయి చూడండి.
మండల సాధన కోసం ప్రజలు నిత్యం నిరసనలు తెలుపుతూ అనేక రకాలుగా ఉద్యమాలు కూడా చేశారు. గుండు గీయించుకొని, అర్ధనగ్ప ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తరోకోలు చేస్తూ మండల సాధన కోసం ఉద్యమించారు. అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఎమ్మెల్యేను ఘోరావ్ కూడా చేశారు. అయినా కూడా మండల ఏర్పాటు సమస్య పరిష్కారం కాలేదు. స్దానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ రావుల మధ్య విభేధాల వలనే మండలం ఏర్పాటు కాలేదని ఎమ్మెల్యేనే మండలం కాకుండా పోవడానికి కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు.

