KA Paul: కేఏ పాల్‌పై కేసు.. పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. తనను లైంగికంగా వేధిస్తున్నారని పాల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక యువతి హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పాల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ యువతి తనకు లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయని షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. ఈ వేధింపులకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను షీ టీమ్స్‌కు సమర్పించినట్లు బాధితురాలు పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు షీ టీమ్స్ ఈ కేసును పంజాగుట్ట పోలీసులకు బదిలీ చేశాయి. పంజాగుట్ట పోలీసులు కె.ఎ.పాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న కె.ఎ.పాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తు పూర్తైన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Retired Professor Kurapati Venkata Narayana Gives Clarity About H-1B Visa | Trump | Telugu Rajyam