India Vs Pakistan: అంతకాలం దాచిన నిజం బయటపెట్టిన పాక్ వాయుసేన అధికారి

India Vs Pakistan: ఎన్నేళ్లుగా బుకాయిస్తూ వచ్చిన పాకిస్థాన్.. ఎట్టకేలకు పుల్వామా దాడిపై అసలు రంగును బయటపెట్టింది. 2019లో జమ్మూకశ్మీర్‌లో జరిగిన అత్యంత హీనమైన ఉగ్రదాడి వెనుక తమ వ్యూహాత్మక చతురత ఉందని పాకిస్థాన్ వాయుసేనలోని వున్నతాధికారి ఔరంగజేబ్ అహ్మద్ బహిరంగంగా వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మీడియా సమక్షంలో ఈ వ్యాఖ్యలు రావడం పాకిస్థాన్ మౌలిక ధోరణిని మరోసారి బహిర్గతం చేసింది.

ఇప్పటికీ భారత్‌-పాకిస్థాన్ మధ్య వైషమ్యం తీవ్రంగా ఉండగా, ఇలా అధికారి స్థాయిలో స్వయంగా అంగీకరించడాన్ని భారత వ్యూహ నిపుణులు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. పుల్వామా దాడిలో 40 మంది జవాన్ల ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ఇది నేరుగా లింక్ అవుతోంది. “భారతదేశానికి వ్యూహాత్మక సంకేతాలిచ్చే లక్ష్యంతోనే దాడి చేశాం” అనే వ్యాఖ్యలు పాకిస్థాన్ గతంలో చెప్పిన మాటలతో పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి.

ఈ వ్యాఖ్యలు పాక్ ఓల్లు రాజకీయాల పునరావృతాన్ని సూచిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకూడదని చెప్పే ఒక పక్క.. ఇటువంటి చురుకైన కార్యాచరణలు చేపట్టడం ద్వారా పాకిస్థాన్‌ ద్వంద్వ విధానాన్ని స్పష్టంగా బయటపెడుతోంది. అంతకుముందు ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఈ దాడిపై తమ ప్రమేయాన్ని ఖండించినప్పటికీ.. ఇప్పుడు ఆ మాటల విలువ ఏమన్నది ప్రశ్నార్థకంగా మారింది.

భారత ప్రభుత్వం ఇదే విషయాన్ని అంతర్జాతీయ వేదికలపై గతంలో పేర్కొన్నప్పటికీ.. పాక్ నిరాదరణతో తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు అదే వాయుసేన అధికారి మాటలతో పుల్వామా దాడికి పాల్పడిన ఉగ్రవాద శిబిరాల వెనుక ప్రభుత్వ మద్దతు ఉన్నదన్న భారత వాదనకు బలం చేకూరింది.

ఇలాంటి వాస్తవాలపై స్పందనగా భారత్ ఎలాంటి దౌత్య చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అంతర్జాతీయ మద్దతుతో పాక్‌పై ఒత్తిడి పెంచితే.. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు చెక్ పెట్టే అవకాశం ఏర్పడుతుంది.

BJP Mounika Sunkara Clear Cut Analysis On Sleeper Cells in Hyderabad | Telangana | Telugu Rajyam