జమ్మూకశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. అందులో శివమొగ్గకు చెందిన మంజునాథ్ కూడా ఉన్నారు. ఈ ఘటనలో భర్తను కోల్పోయిన భార్య పల్లవి, కుమారుడు అభిజేయ కనీసం ఏడిపే స్థితిలో లేకుండా పోయారు.
పల్లవి మాట్లాడుతూ, “కుమారుడికి ఆకలిగా ఉండడంతో భర్త రొట్టె తీయడానికి వెళ్లారు. కొద్దిసేపటికే కాల్పులు వినిపించాయి. మొదట ఆర్మీ కాల్పులేమో అనుకున్నాం. కానీ మా భర్తను రక్తపు మడుగులో పడి చూసేలోపు అంత అయిపోయింది. తలలో బుల్లెట్ గాయం చేసింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు” అని కన్నీటితో చెప్పారు.
ఆ తర్వాత ఒక ఉగ్రవాదిని తాము ఎదుర్కొన్నామని చెప్పిన పల్లవి, “నా భర్తను చంపావ్ కదా, మమ్మల్ని కూడా చంపు” అని నిలదీసినట్లు చెప్పారు. ఆమె కుమారుడు కూడా “కుక్కా, మా నాన్నను చంపావ్, మమ్మల్ని కూడా చంపు” అని విలపించాడని చెప్పారు. అయితే ఆ ఉగ్రవాది “మిమ్మల్ని చంపను, ఈ విషయాన్ని మోదీకి చెప్పండి” అని వెళ్లిపోయినట్లు వివరించారు.
పల్లవి ప్రభుత్వాన్ని కోరుతూ, “మా భర్త మృతదేహాన్ని శివమొగ్గకు పంపించండి. మేమంతా ముగ్గురం కలిసి వచ్చాం, ఒంటరిగా మాత్రం తిరిగి వెళ్లలేం” అంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే నలుగురు ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నారని చెబుతూ వారు ఆర్మీ దుస్తుల్లో లేరని అన్నారు. ఎక్కువగా హిందువులను, అందులోనూ మగవారిని టార్గెట్ చేసి కాల్పులు జరిపారని ఆమె వివరించారు. ఇక మంజునాథ్ మృతదేహం తరలింపుతో పాటు తమ భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆమె అభ్యర్థించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనను కలిగిస్తోంది.