![]()
![]()
సిబిఐ తాత్కాలిక డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు గురించి ఆసక్తి కరమయిన పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
నాగేశ్వరరావు ఎంపిక స్పష్టంగా ఒక లక్ష్యం కోసం జరిగింది. లంంచం కేసులో ఇరుక్కుని, ఉద్యోగం పొగొట్టుకున్న స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్తానా లేని లోటును తక్షణం పూరించాలి.ఈ ఖాళీని పూరించగల విశ్వాస పాత్రుడు కావాలి. దానికి నాగేశ్వరరావు సరైన వాడని ప్రధాని గుర్తించారు. అందుకే ఐజి ర్యాంకులోనే ఉన్నా ఆయనకు డైరెక్టర్ గా బాధ్యతలప్పగించారని మీడియా పలుకథనాలు వస్తున్నాయి. సిబిఐ చరిత్రలో ఇలాంటి నియామకం ఇదే మొదటి సారి.
మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్తానా ప్రధాని మోదీకి చాలా ఇష్టమయిన ఐపిఎస్ అధికారి. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన ఎన్నొ కీలకమయిన దర్యాప్తులలో మోదీ మైండ్ లో ఏముందో అదే సాక్ష్యాధారాలో రుజువు చేస్తూ వచ్చారు. దీనికి 2002 గోద్రా విచారణను ప్రముఖంగా ఉదహరిస్తారు. 2002 గోద్రా రైలుకు నిప్పింటంచడం ముందుగానే పథకం ప్రకారం అమలు చేసిన కుట్ర అని మోదీ ఆ రోజుల్లో చెబుతూ వచ్చారు. రైలుకు నిప్పంటించడం వెనక కుట్ర ఉందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని దర్యాప్తు సంస్థలే అంతకు ముందు చెప్పినా, చివరకు అస్తానా ‘విచారణ’లో కుట్రగా తేల్చేశారు. మోదీ ప్రధాని ఆయ్యాక అస్తానాను సిబిఐకి తీసుకువచ్చారు.
పలువురు ప్రతిపక్ష నాయకుల మీద వచ్చిన అవినీతి ఆరోపణలను ఆస్తానా విచారణకు స్వీకరించారు. అనేక మంది ప్రతిపక్ష నేతలను విచారణ పేరుతో అపకీర్తి పాలు చేయాల్సిన మోదీ గారి మిత్రుడే చివరకు ముడుపులు స్వీకరించి, అభాసు పాలయి, అవమాన కరంగా సిబిఐ నుంచి బయలకు వెళ్లి పోవలసి వచ్చింది.
ఆయన నిష్క్రమణ సిబిఐని అభాసు పాలు చేసింది.ఒక కీలకయమని సమయంలో సిబిఐ లో మోదీ సన్నిహితులెవరూ లేకుండా కూడా చేసింది. ప్రతిపక్షాన్ని నైతికంగా దెబ్బతీయాలన్న మోదీ ప్రభుత్వం లక్ష్యం నెరవేరకుండానే అస్తానా నవ్వుల పాలయ్యారు. ఈ ఖాళీని పూరించగల విశ్వాస పాత్రుడు కావాలి. దానికి నాగేశ్వరరావు సరైన వాడని గుర్తించారు. అందుకే ఐజి ర్యాంకులోనే ఉన్నా ఆయనకు డైరెక్టర్ గా బాధ్యతలప్పగించారు.
నాగేశ్వరావుకు ఇంత ప్రాముఖ్యం ఎలా వచ్చిందనేది ఇపుడు జాతీయ మీడియా లో బాగా చర్చనీయాంశమయింది. ఎందుకంటే, ఆయన ఉద్యోగం జీవితంలో వివాదాలు కూడా చాలా ఉన్నాయి. అయినా ఆయన కెరీర్ గ్రాఫ్ అలా అలా దూసుకు పోతువచ్చింది. రహస్యమేమిటి?
ఆయన కార్యకలాపాలు, ముఖ్యంగా సాంస్కృతిక కార్యకలాపాలు చూస్తే, నాగేశ్వరావు సైద్ధాంతికంగా బిజెపికి బాగా సన్నిహితుడిలా కనిపిస్తారు. పోలీసు అధికారిగా ఉంటున్నా బిజెపి అజండాను చాలా జాగ్రత్తగా ఆయన అమలుచేస్తూ వస్తున్నారు. హిందూ సంస్థలకు ఇంతకంటే ఏంకావాలి. ఆయన ఉద్యోగ జీవితంలో చాలా వివాదాలు చోటు చేసుకునేందుకు ఇదే కారణం. ఆయనకు మైనారిటీ వ్యతిరేకి అనే పేరుంది.
నబ్రంగ్ పూర్ జిల్లా ఎస్ పి గా ఉన్నపుడు (మార్చి 1994) ఆయన మతమార్పిడులను వ్యతిరేకిస్తూ పాఠశాలల హెడ్ మాస్టర్లందరికి ఒక లేఖ రాశారు. ఇది బిజెపి, ఆర్ ఎస్ ఎస్ లకు ఇంత ఇష్టమయిన విషయమో చెప్పాల్సిన పనిలేదు. ఒక అధికారి ఇలా మతమార్పిడులకు వ్యతిరేకంగా లేఖ రాయడం అప్పట్లో బాగా చర్చనీయాంశమయింది. తర్వాత 1998లో ఆయన మరొక వివాదంలో చిక్కుకున్నారు. బెర్హాంపూర్ డెవెలప్ మెంట్ అధారిటీ వైస్ చెయిర్మన్ గా ఉన్నపుడు ‘ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే’ సందర్భంగా ప్రసంగిస్తూ భారత రాజ్యాంగ నిర్మాతలు ‘మైనారిటీ పక్షపాతం’ ఉన్నవారని ఒక అపవాదు వేశారని ఒడిషా సిపిఎం సెక్రెటరీ కిషోర్ పట్నాయక్ అన్నారు. మరొక సందర్భంలో ఆయన ముస్లింలను, క్రైస్తవులను, మార్క్సి స్టులను ఒక గాట కట్టి ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో దేశం కంటే మతానికి ప్రాముఖ్యమిస్తారని ముస్లింలను, క్రైస్తవులను ఆయన నిందించారని అనుపమ్ భారత్ అనే ఒరియా పత్రిక రాసింది. ఆయన వివాదాస్సద వ్యాఖ్యల మీద ఒడిశాలో విచారణకూడా జరిగింది.ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రెవిన్యూ డివిజినల్ కమిషనర్, డిఐజిలు చేసిన విచారణలో వెల్లడయింది. తర్వాత ఆయనను బెర్హాంపూర్ నుంచి బదిలీ చేశారని పట్నాయక్ ‘ద వైర్ ’ కు తెలిపారు.
ఎకనాకమిక్ టైమ్స్ కూగా నాగేశ్వరరావు మీద చాలా ఆసక్తి కరమయిన కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రకారం, నాగేశ్వరావు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కు బాగ సన్నిహితుడు. ఆయన ‘హిందూ’ కార్యకలాపాలలో పాల్గొంటారని, రామ్ మాధ్ వ్ ఏర్పాటు చేసిన ఇండియా ఫౌండేషన్ వంటి సంస్థలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారని ఈ పత్రిక రాసింది. ఈ మధ్య విడుదలయిన ‘హిందూ చార్టర్ ఆఫ్ డిమాండ్స్’ రూపకల్పనలో నాగేశ్వరావు క్రియాశీల పాత్ర పోషించారు. ఇలాగే బీఫ్ ఎగుమతులను బ్యాన్ చేయాలని,ఆలయాలను రాష్ట్ర ప్రభుత్వాల పట్టునుంచి విముక్తి చేయాలని కూడా ఆయన చురుకుగా ప్రచారం చేస్తున్నారు. ఎకనమిక్ టైమ్స్ ప్రచురించిన అంశాలన్నీ సాధారణంగా ప్రభుత్వాధికారులు ప్రచారం చేయగలిగే అంశాలు కావు. ఆర్ ఎస్ ఎస్ లేదా అనుబంధ సంస్థల కార్యక్ర మాలకిందకు వస్తాయి. దీనిని బట్టి చూస్తే బిజెపి రాజకీయ అజండాను అమలు చేయగలిగే వ్యక్తి అయినందునే ఆయనను రాత్రికి రాత్రి సిబిఐ (తాత్కాలిక) డైరెక్టర్ గా నియమించారని అర్థమవుతుంది. ఆయన కచ్చితంగా అస్థానా లేని లోటు తీర్చగలరని ఎవరికైనా నమ్మకం కుదురుతుంది కూడా…
