ప్రముఖ సినీ నిర్మాత కన్నుమూత

ప్రముఖ సినీ నిర్మాత కోటిపల్లి రాఘవ కన్నుమూశారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో గుండెపోటుతో మంగళవారం ఉదయం ఆయన మరణించారు. 1913 డిసెంబర్ 9న రాఘవ జన్మించారు. తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి రాఘవ స్వస్థలం. ఆయన ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్ పై 30కి పైగా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. తరంగిణి, తూర్పు పడమర వంటి పలు చిత్రాలను నిర్మించారు. 1972లో తాత మనవడు, 1973లో సంసారం సాగరం సినిమాలకు నంది అవార్డు అందుకున్నారు. సినీ దిగ్గజాలైన దాసరి నారాయణ రావు, కోడి రామకృష్ణ, రావు గోపాల్ రావు, గొల్లపూడి మారుతీరావు, ఎస్పీ బాలు, సుమన్ , భాను చందర్ లను రాఘవనే ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం, 2012లో రఘుపతి చలనచిత్ర అవార్డును సైతం ఆయన అందుకున్నారు. రాఘవ కు ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు. రాఘవ భార్య కొన్నాళ్ల క్రితమే అనారోగ్యంతో కన్ను మూసింది. మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. పలువురు సినీ ప్రముఖులు రాఘవ మృతికి సంతాపం తెలిపారు.