Elon Musk: ఇండియాలో మస్క్ నెట్‌వర్క్ రెడీ.. జియో – ఎయిర్‌టెల్‌ పోటీ తప్పదు!

భారతదేశంలో ఇంటర్నెట్ విస్తరణలో కీలకంగా మారే పరిణామం జరిగింది. ఎలాన్ మస్క్‌కి చెందిన ‘స్టార్‌లింక్’ సంస్థకు టెలికాం శాఖ నుంచి శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలు అందించేందుకు అవసరమైన లైసెన్స్ మంజూరు అయింది. దీంతో దేశంలోని ప్రతి తాలూకాలోనూ, కనివినీ ఎరుగని ప్రాంతాల్లోనూ కూడా త్వరలోనే స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. ఇది డిజిటల్ ఇండియాకు బూస్ట్ ఇచ్చే పాజిటివ్ డెవలప్‌మెంట్‌గా భావిస్తున్నారు.

స్టార్‌లింక్‌కి లైసెన్స్ మంజూరుతో ఇది భారత్‌లో శాట్‌కామ్ సేవలు అందించేందుకు అవకాశం పొందిన మూడవ ప్రైవేటు సంస్థగా గుర్తింపు పొందింది. ఇప్పటివరకు రిలయన్స్ జియో – జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌టెల్‌ – వన్‌వెబ్ మాత్రమే లైసెన్స్ కలిగి ఉన్నాయి. మస్క్ కంపెనీకి అనుమతి రావడం ద్వారా భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. దేశంలోని కుదురైన గిరిజన ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో ఇంటర్నెట్ విస్తరణను వేగవంతం చేయడంలో ఇది కీలకంగా మారనుంది.

ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ వెల్లడించిన సమాచారం ప్రకారం, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం (డీఓటీ) ఇటీవలే ఈ లైసెన్స్ మంజూరు చేసింది. తదుపరి దశలో, సంస్థకు ట్రయల్ స్పెక్ట్రమ్ కేటాయించే అవకాశం ఉందని టెలికాం వర్గాలు వెల్లడించాయి. దీని ద్వారా సేవల ప్రారంభానికి మార్గం సుగమమవుతుందన్న మాట.

దేశంలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, డిజిటల్ హెల్త్‌కేర్, రూరల్ కనెక్టివిటీ రంగాల్లో ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రభావం చూపనున్నాయి. ఎలాన్ మస్క్ టెక్నాలజీ భారత్‌లో అడుగుపెట్టడం సరికొత్త డిజిటల్ యుగానికి దారి తీయనుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

KK Latest Survey Report On YS Jagan Political Graph || CM Chandrababu Naidu || Pawan Kalyan || TR