జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత అమెరికా మొదట భారత్కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, అంచనాలను తలకిందలు చేస్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని ఒక్కసారిగా మార్చేశారు. మొదట భారత్ నిర్ణయానికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పిన ట్రంప్, ఇప్పుడు ఈ సమస్యను భారత్–పాకిస్థాన్ దేశాలే పరిష్కరించుకోవాలని వ్యాఖ్యానించారు.
వాటికన్లో జరిగే కార్యక్రమానికి హాజరవడానికి వెళ్లే సమయంలో విమానంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్, “భారత్పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. కానీ మేము ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం అనవసరం. ఇరు దేశాలు తమ సమస్యలను స్వయంగా పరిష్కరించుకోవాలి” అని స్పష్టం చేశారు. భారత్కు మద్దతుగా ఉంటామని తొలుత చెప్పిన ట్రంప్ ఇప్పుడు సైడుగా వెళ్లడం చర్చనీయాంశమైంది.
ఇంతలో పాకిస్థాన్ నుంచి స్పందనలు వెల్లువెత్తాయి. పాక్ ప్రధాని భారత్పై తీవ్ర వ్యాఖ్యలు చేయగా, ప్రతిపక్ష నేత భుట్టో సైతం సింధు నదీ జలాల విషయంలో గద్దెం దిగిపోవాలని హెచ్చరించారు. భారత్కు కాలు దువ్వితే తాము గట్టి సమాధానం ఇస్తామని పాక్ నేతలు ప్రకటించారు. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
అమెరికా మీడియా న్యూయార్క్ టైమ్స్ కూడా పహల్గాం ఘటనను స్పష్టంగా ఉగ్రదాడిగా పేర్కొంది. అయితే ట్రంప్ చివరి నిమిషంలో తన మాట మార్చడం భారత్ వర్గాల్లో ఆగ్రహానికి దారితీసింది. ఇకపై అమెరికా మద్దతుపై ఎంత వరకు ఆశ పెట్టుకోవాలో అనే అంశంపై భారత్ ఆలోచన ప్రారంభించింది. మొత్తానికి, ట్రంప్ సుడిగాలి నిర్ణయాలు మళ్లీ వార్తల్లోకి ఎక్కాయి. భారత్కు అండగా నిలవాలన్న మాటలే తప్ప.. వాస్తవంలో ఏమీ జరగని పరిస్థితి కొనసాగుతోంది. ఇక పాక్ అహంకార వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రం తదుపరి ఎత్తుగడలపై చర్చలు ముమ్మరమయ్యాయి.