సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, ఎన్డీయే నేతలు, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతులు జగదీప్ ధన్ఖడ్, వెంకయ్యనాయుడు హాజరయ్యారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణన్ విజయం సాధించిన తర్వాత గురువారం మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో రాధాకృష్ణన్కు 452 ఓట్లు రాగా, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. 152 ఓట్ల తేడాతో రాధాకృష్ణన్ విజయం సాధించారు.
రాధాకృష్ణన్ రాజకీయ జీవితం: రాధాకృష్ణన్ 16 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. తమిళనాడు బీజేపీలో కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. 1998, 1999 లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టడానికి ముందు జార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చేరిల్లో గవర్నర్గా సేవలు అందించారు. తన అనుచరులు ఆయన్ను ‘తమిళనాడు మోదీ’ అని పిలుచుకుంటారు.


