మొన్నీమధ్యనే పవన్ కళ్యాణ్, బాలకృష్ణ కలుసుకున్నారు. ఇరువురి సినిమా షూటింగులూ ఒకే చోట జరుగుతుండడంతో, సెట్స్లో సరదాగా పవన్, బాలకృష్ణ ముచ్చట్లాడుకోవడానికి (షూటింగ్ గ్యాప్లో) అవకాశం దొరికి వుండొచ్చు.
పైకి కనిపించే అభిమానుల యుద్ధాలు, రాజకీయ యుద్ధాలు వేరు. సినీ పరిశ్రమలో ఒకరికొకరు ఎదురుపడితే, ఎంతటివారైనా ఆప్యాయంగా పలకరించుకుంటారు. ఇక్కడ ఎంతటివారైనా.. అంటే, బేషజాల విషయంలో కావొచ్చు, స్టార్డమ్ విషయంలో కావొచ్చు.. మరో విషయంలో కావొచ్చు.
పవన్ కళ్యాణ్, బాలకృష్ణ కేవలం సినీ నటులు మాత్రమే కాదు. ఇద్దరూ రాజకీయ నాయకులు కూడా. గతంలో అన్స్టాపబుల్ టాక్ షో సందర్బంగా, త్రివిక్రమ్ శ్రీనివాస్తో మాట్లాడిన సందర్భంలో ‘ఎప్పుడొస్తున్నావ్.?’ అని ప్రశ్నించడమే కాదు, ఎవరితో రావాలో తెలుసు కదా.? అని బాలయ్య ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అది పవన్ కళ్యాణ్ గురించే.
రాజకీయంగా టీడీపీ – జనసేన మధ్య రాజకీయం వైరం వుండొచ్చు, రాజకీయ స్నేహమూ వుండొచ్చు. చిరంజీవితో గతంలో బాలయ్యకూ రాజకీయ వివాదాలు వుండొచ్చు. కానీ, ఇద్దరి మధ్యా స్నేహం మామూలే.
ఇంతకీ, పవన్ – బాలయ్య భేటీ ఎందుకు.? ఎలా.? జరిగినట్టు.! ఈ విషయమై తాజాగా వినిపిస్తున్న ఓ గాసిప్ సారాంశమేంటంటే, ఈ భేటీకి తెరవెనుక వ్యూహం రచించింది చిరంజీవేనని. చిరంజీవి, బాలయ్య తొలుత మాట్లాడుకున్నాకే బాలయ్య – పవన్ భేటీ జరిగిందట. మరోపక్క, యంగ్ టైగర్ ఎన్టీయార్ కూడా ఈ భేటీకి తెరవెనుకాల తనవంతు భూమిక పోషించాడని అంటున్నారు. అయితే, అది రాజకీయం కోసమా.? సినీ పరిశ్రమ కోసమేనా.? అన్నది మాత్రం సస్పెన్స్.
