ఒకప్పుడు పిచ్పై బౌన్సర్లు, స్వింగ్తో ప్రత్యర్థుల్ని బెంబేలెత్తించిన బౌలర్.. ఇప్పుడు రాజకీయ పర్యవేక్షణలో శక్తివంతమైన నాయకుడు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి క్రికెట్ అంటే ఎనలేని ప్రేమ. రంజీ క్రికెట్లో భాగంగా ఎన్నో మ్యాచ్లు ఆడిన ఆయన, తాజాగా తన ఆటగాడిగా గడిపిన కాలాన్ని గుర్తు చేసుకున్నారు.
సోషల్ మీడియా వేదికగా పాత ఫొటోలను పంచుకుంటూ, ఓ అరుదైన విజయాన్ని అభిమానులతో భాగస్వామ్యం చేసుకున్నారు. ప్రస్తుత టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మను ఔట్ చేసిన క్షణం. “హైదరాబాద్ తరఫున ఆడుతున్నప్పుడు ముంబైపై జరిగిన మ్యాచ్ లో రోహిత్ను ఔట్ చేసిన క్షణం ఎన్నటికీ మరిచిపోలేను” అంటూ తాను చేసిన ట్వీట్కు మంచి స్పందన వచ్చింది.
Cricket has always been a deep passion of mine and recently I came across some old newspaper clippings that stirred up a wave of nostalgia. One memory that stood out was the unforgettable moment when I dismissed the current Indian captain Rohit Sharma. Moments like these are… pic.twitter.com/6wHtrtLzyX
— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) May 13, 2025
అప్పటి క్రికెట్ జీవితంలో విజయం తానెప్పటికీ గుర్తుంచుకునే గొప్ప మలుపు అని ఆయన అన్నారు. ముంబై వంటి బలమైన జట్టుపై మ్యాచ్ గెలవడంలో తాను తీసిన కీలక వికెట్లను గుర్తుచేసుకున్నారు. కౌశిక్ రెడ్డి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 15 మ్యాచ్లు ఆడి 47 వికెట్లు తీశారు. బ్యాటింగ్లో కూడా కాసింత మెరుపు చూపించి 299 పరుగులతో ఓ అర్ధ సెంచరీ నమోదు చేశారు.
ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నా.. తన క్రికెట్ ప్రయాణం ప్రతి అడుగులోకి స్ఫూర్తి ఇస్తోందని ఆయన అన్నారు. రోహిత్ లాంటి ఆటగాడిని ఔట్ చేయడం అనేది ఆ సమయంలో చిన్న విజయంగా అనిపించినా, ఇప్పటికీ తన మనసు గర్వపడేలా చేస్తోందని అన్నారు. రాజకీయాల్లో గేమ్ ప్లాన్ చేయాల్సిన ఈ దశలో, క్రికెట్ గేమ్ నుంచి వచ్చిన అనుభవాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు.