Narendra Modi: సరిహద్దుల్లో సంకేతాలు స్పష్టంగా మారుతున్నాయా? ప్రధానికి ఎయిర్ చీఫ్ అప్డేట్!

పహల్గామ్ దాడి అనంతరం దేశంలో భద్రతపై సున్నితంగా స్పందిస్తున్న కేంద్రం, వరుసగా త్రివిధ దళాలతో సమీక్షలు నిర్వహిస్తోంది. తాజాగా భారత వాయుసేన అధిపతి ఏయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో సరిహద్దు పరిస్థితులపై సమగ్ర నివేదికను ప్రధానికి సమర్పించిన ఎయిర్ చీఫ్, ఐఏఎఫ్ ప్రస్తుత రెడీనెస్ స్థాయిని వివరించినట్లు సమాచారం. పాకిస్థాన్ వైపు నుంచి దాడులు జరిగే అవకాశం ఉందన్న సూచనలు ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

వాయుసేన ప్రణాళికలో భాగంగా పశ్చిమ సరిహద్దు వెంబడి యుద్ధ విమానాల గస్తీని పెంచినట్టు, అత్యవసర స్పందనకు సన్నద్ధంగా ఉండేందుకు ముఖ్యమైన స్టేషన్లలో ఫుల్ ఆర్మ్‌డ్ ఫైటర్ జెట్లను రెడీగా ఉంచినట్టు చీఫ్ తెలిపారు. ప్రధానంగా రఫేల్ వంటి సాంకేతికంగా అత్యున్నత యుద్ధ విమానాలే కాక, సుఖోయ్-30 ఎంకేఐ, మిరేజ్ 2000 వంటివి కూడా రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు.

ఇక రఫేల్ వాయుసేనకు అందిన తర్వాత టెక్నికల్ అడ్వాంటేజ్ మరింత పెరిగిందని మిలిటరీ వర్గాలు చెబుతున్నాయి. స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్ ద్వారా దూర లక్ష్యాలను ఛేదించడమే కాక, మీటియోర్ మిసైళ్లతో శత్రు విమానాలను పట్టే సామర్థ్యం కూడా ఐఏఎఫ్‌కు కలిగిందని చెబుతున్నారు. ఈ క్రమంలో సమీప భవిష్యత్తులో ఎలాంటి అప్రత్యక్ష దాడులు జరిగినా తక్షణ స్పందనకు ఐఏఎఫ్ సిద్ధంగా ఉందన్న సంకేతాలు వచ్చాయి.

సరిహద్దు ఉత్కంఠతో భద్రతా రంగం అత్యున్నత స్థాయిలో అప్రమత్తంగా ఉండగా, ప్రధాని వరుసగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లతో భేటీ కావడం కీలక పరిణామంగా మారింది. రాజకీయంగా హస్తినలో ఈ చర్చలపై దృష్టి కేంద్రీకృతమవుతుండగా, మోదీ ప్రభుత్వం రాబోయే చర్యలపై ఏమైనా సంకేతాలిస్తుందా అనే ఆసక్తి మొదలైంది.

Cine Critic Dasari Vignan About Prabhas Spirit Movie || Sandeep Reddy Vanga || DeepikaPadukone || TR