మోడీకి ఇచ్చి పాడేసిన ఇలియానా..!

ఇవ్వాలనుకున్నప్పుడు ఇచ్చి పాడేయ్యడమే.. అనాలనుకున్నప్పుడు అనేసిపోవడమే అని ఫిక్సయ్యిందో ఏమో కానీ… భారతదేశ ప్రధానికి పరోక్షంగా చురకలంటించినంతపనిచేసింది గోవా బ్యూటీ ఇలియానా! ప్రస్తుతం ఈమె కామెంట్లు వైరల్ అవుతున్నాయి. సైలంట్ గా దింపిందంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

గత ఆరు నెల రోజులుగా భారతీయ రెజ్లర్లు చేస్తున్న పోరాటం ప్రస్తుతం దేశం మొత్తం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి వారికి మద్దతు దొరుకుతుంది. ఇండియన్ రెజ్లర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ తమని వేధించాడని.. మాలిక్, వినేష్ ఫోగట్, సంగీత లాంటి రెజ్లర్లు ఆందోళనకు దిగారు. బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అయితే వీరి ఆందోళనలపై ప్రభుత్వ స్పందన కరువైందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఇలియానా స్పందించింది. సినిమా, తన పర్సనల్ వ్యవహారాలు తప్ప సామాజిక అంశాల గురించి ఎప్పడూ స్పందించిన గోవా బ్యూటీ… తాజాగా రెజ్లర్లకి మద్దతుగా పోస్ట్ పెట్టింది. “పోలీసులతో సాక్షి మాలిక్ పోరాడుతున్న పిక్” ని ఇలియానా ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. “సాక్షి మాలిక్ గురించి గతంలో మోడీ ప్రశంసలు కురిపించిన ట్వీట్” ని కూడా యాడ్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ గా మారింది.

“సాక్షాత్తు ప్రధాన మంత్రి ప్రశంసలు కురిపించిన మహిళా రెజ్లర్ పరిస్థితి ఇదీ” అని అర్థం వచ్చేలా ఇలియానా ఆ పోస్ట్ చేసింది. రెజ్లర్లకి మద్దతు తెలిపినందుకు ఇలియానాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు! అయితే ఈ విషయాలపై మోడీ & కో కి చీమకుట్టినట్లయిన లేదనే కామెంట్లూ బలంగా వినిపిస్తున్నాయి!