టాలీవుడ్ నటుడు వినోద్ కన్నుమూత

టాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ కన్నుమూశారు. ఈ రోజు తెల్లవారుజామున బ్రెయిన్ స్ట్రోక్ తో ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో కన్ను మూశారు. పలు చిత్రాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించిన ఆయన పలు సీరియళ్లలోనూ నటించారు. 300 కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు.ఆయన మొదటి సినిమా 1980 లో వి.విశ్వేశ్వరరావు డైరెక్షన్ లో వచ్చిన కీర్తి కాంత కనకం. ఈ సినిమాలో ఆయన హీరోగా నటించారు.  ఇంద్ర, చంటి, నరసింహనాయుడు, ,లారీ డ్రైవర్ ,మిర్చి  సినిమాల్లో తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. వినోద్ అసలు పేరు అరిశెట్టి నాగేశ్వరరావు..ఆయన స్వస్థలం తెనాలి. ఫ్యాక్షన్  సినిమాల్లో విలన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్న ఆయన మృతి వార్తతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది.