సమస్యల నుండి విముక్తి పొందాలంటే సోమవారం శివయ్యకు ఇలా పూజ చేయాల్సిందే!

సాధారణంగా మనిషి జీవితంలో ఏదో ఒక సమస్య ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. ఇలా జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి విముక్తి పొందటానికి చాలామంది అనేక రకాల పూజలు, పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే అలాంటివారు మహా శివుడిని భక్తిశ్రద్ధలతో పూజించి కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ దూరమవుతాయి. సోమవారం రోజున పరమశివుడికి అంకితం చేశారు. అందువల్ల ప్రతి సోమవారం రోజున భక్తిశ్రద్ధలతో శివుడిని పూజించి ఆరాధించడం వల్ల సమస్యలు తొలగిపోవడమే కాకుండా పుణ్యం లభిస్తుంది.

ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ సమస్యల నుండి విముక్తి పొందలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంత కష్టపడి పనిచేసిన కూడా డబ్బు సంపాదించలేక ఇబ్బంది పడుతున్న వారు సోమవారం నాడు శివుడిని పూజించండం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు సోమవారం నాడు రాత్రి శివలింగం ముందు నెయ్యి దీపం వెలిగించాలి. 41 రోజులపాటు ఇలా క్రమం తప్పకుండా శివుడి ముందు నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఆ శివుడి అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు దూరం అవటమే కాకుండా డబ్బు కూడా లభిస్తుంది.

అలాగే ప్రతి సోమవారం రోజున శివుడిని భక్తిశ్రద్ధలతో పూజించి ఆ తర్వాత తేనెతో శివుడికి అభిషేకం చేయటం వల్ల కుటుంబ కలహాలు తొలగిపోయి కుటుంబ సభ్యులందరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమాభిమానాలతో ఉంటూ ఆ ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయి. ఇలా చేయడం వల్ల ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన సమస్యలు కూడా దూరం అవుతాయి. అంతేకాకుండా ప్రతి సోమవారం రోజున శివుడికి ఇష్టమైన బిల్వపత్రి, పాలు, నీటితో అభిషేకం చేయటం వల్ల ఆ శివుడి అనుగ్రహం లభించి మనం చేపట్టిన పనులలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి ఆ పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి.