ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనవంతులు కావాలంటే మనీ ప్లాంట్ కి ఈ వస్తువు ముడివేస్తే చాలు..?

సాధారణంగా కొన్ని రకాల మొక్కలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. అందువల్ల వాటిని ఇంట్లో ఉంచి పూజిస్తూ ఉంటారు. అలాగే మనీ ప్లాంట్ మొక్కని కూడా ప్రతి ఒక్క ఇంట్లో పెంచుతూ ఉంటారు. మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెంచడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుందని ప్రజల నమ్మకం. అందుకే దీనిని ఇల్లు, బాల్కనీ, గది, కార్యాలయం ఇలా ప్రతిచోట పెంచుతూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ఉన్న ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ఒక్క పరిహారం చేసిన వెంటనే మనీ ప్లాంట్ వల్ల మీ ఇంట్లో సంపద పెరిగి ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారని, ధనవంతులు అవుతారని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం.. మనీ ప్లాంట్ ని ఎప్పుడూ ఈశాన్య దిశలో నాటాలి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా మనీ ప్లాంట్ ఆకులు నేలపై పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంట్లో మనీ ప్లాంట్ పెంచడం వల్ల ఆర్థిక సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. ఎందుకంటే మనీ ప్లాంట్ శుక్రుడితో సంబంధం కలిగి ఉంటుంది. అందువల్ల ఇంట్లో ఈ సన్నిధిలో మనీ ప్లాంట్‌ను ఉంచడం వల్ల శుక్రుడు అనుకూలంగా ఉంటాడు.ఇక శుక్రవారం రోజు మనీ ప్లాంట్ కి ఎర్రదారం కట్టడం వల్ల ఇంట్లో అనుకూల ప్రభావం ఉంటుంది. ఇలా ఎర్ర దారం కట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి సుఖ, సంతోషాలు చేకూరుతాయి.

అయితే మనీ ప్లాంట్‌ కి ఎర్రదారం కట్టేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. శుక్రవారం రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంట్లో లక్ష్మీ దేవిని పూజించి ధూప దీపాలు వెలిగించాలి. అయితే మనీ ప్లాంట్‌ కి కట్టబోయే దారాన్ని అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజించాలి. పూజ ముగిసిన తర్వాత అమ్మవారికి హారతిని ఇచ్చి, ఎర్రటి దారానికి కుంకుమ పూసి ఈ దారాన్ని మనీ ప్లాంట్ మూలానికి కటాలి. శుక్రవారం రోజున ఇలా మనీ ప్లాంట్ కి ఎర్ర దారం కట్టడం వల్ల కొన్ని రోజుల తర్వాత అద్భుతమైన ప్రయోజనాలను చూస్తారు.