సంక్రాంతి పండుగ రోజున గంగిరెద్దులకు గల ప్రత్యేకత ఏమిటో తెలుసా..?

తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరికి సంక్రాంతి పండుగ చాలా పెద్ద పండుగ. ధనుర్మాసంలో వచ్చే ఈ సంక్రాంతి పండుగను ప్రజలందరూ మూడు రోజులపాటు ఘనంగా జరుపుకుంటారు. ఇంటిల్లిపాది ఎంతో ఆనందంగా ఇంటిముందు రంగురంగుల ముగ్గులు వేసి ఇంటిని రంగురంగుల పువ్వులతో అలంకరించి రకరకాల పిండి వంటలు, హరిదాసు గీతాలు, గాలిపటాలు, గంగిరెద్దుల కోలాహలం ఈ సంక్రాంతి పండుగకు చాలా ప్రత్యేకమైనవి. సంక్రాంతి పండుగ జరుపుకునే మూడు రోజులపాటు మొదటి రోజు భోగి పండుగ. ఈ భోగి పండుగ రోజున భోగిమంటలు వేయటం ప్రత్యేకత. ఇక మకర సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగరవేయటం, హరిదాసు గీతాలు, కోళ్ల పందాలు, గంగిరెద్దుల కోలాహలం ప్రత్యేకమైనవి.

అయితే సంక్రాంతి పండుగ రోజున ఇలా గంగిరెద్దులు పొలాహలం చేయటానికి గల కారణం వాటి ప్రత్యేకతల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం సంక్రాంతి పండుగ రోజున గంగిరెద్దులు సంచరించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. పూర్వం గజాసురుడునే రాక్షసుడు కఠినమైన తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకున్నాడు ఇలా అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకొమ్మని అడుగగా .. తన గర్భంలో ఉండాలని గజాసురుడు కోరుకోవడంతో అతని కోరిక మేరకు పరమేశ్వరుడు గజాసురుని గర్భంలో ప్రవేశించాడు. అయితే తన పతి పరమేశ్వరుడు కనిపించకపోవటంతో పార్వతి దేవి విష్ణుమూర్తి వద్దకు వెళ్లి విచారించింది.

ఆ సమయంలో విష్ణుమూర్తి శివుని వాహనమైన నందీశ్వరుని రూపంలో గంగిరెద్దు మారువేషంలో సకల దేవతలతో కలిసి వాయిద్యాలతో గజాసురుడు ముందుకు వెళ్లి నాట్యం ఆడారు. విష్ణుమూర్తి నాట్యానికి మంత్రముగ్ధుడైనా గజాసురుడు ఏం వరం కావాలో కోరుకోమని చెప్పగా.. వెంటనే గంగిరెద్దు వేషంలో ఉన్న విష్ణుమూర్తి తన వెంటనే తన స్వామిని తన చెంతకు పంపించు అని అడుగుతాడు.ఇలా అడగడంతో వెంటనే తేరుకున్న గజాసురుడు వచ్చింది విష్ణుమూర్తి అని గ్రహించాడు. ఆ తర్వాత విష్ణువు ఆజ్ఞ మేరకు నందీశ్వరుడు గజాసురుని గర్భాన్ని చీల్చడంతో శివుడు బయటకు వస్తాడు. మాట తప్పని గజాసురుడిని ప్రజలందరూ పూజించాలని ప్రతి ఏటా సంక్రాంతి పండుగ రోజున గజాసురిడి వేషంలో ప్రతి ఇంటికి తిరుగుతాడు.